Headlines

ప్రపంచంలోనే మొట్టమొదటి సబ్‌మెరైన్ ఎప్పుడు, ఎలా నిర్మించారు, దానిని ఎలా నడిపారు? నీటి అడుగున ప్రయాణం వెనుక

ప్రపంచంలోనే మొట్టమొదటి సబ్‌మెరైన్ ఎప్పుడు, ఎలా నిర్మించారు, దానిని ఎలా నడిపారు? నీటి అడుగున ప్రయాణం వెనుక


ప్రపంచంలోనే మొట్టమొదటి సబ్‌మెరైన్ చరిత్ర, దాని సాంకేతిక పరిణామం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. ఆధునిక కాలంలో అణ్వాయుధాలు మోసుకెళ్లే జలఅంతర్గాములకు ఈ తొలి నమూనాలే పునాదిగా నిలిచాయి. ప్రపంచంలోనే మొదటిసారిగా నీటి అడుగున కదిలే సామర్థ్యం ఉన్న జలఅంతర్గామిని 1620లో డచ్ ఇంజనీర్ కార్నెలిస్ డ్రెబ్బెల్ రూపొందించారు. ఇది గ్రీజు పూసిన తోలుతో కప్పబడిన చెక్క పడవ. లండన్‌లోని థేమ్స్ నదిలో 15 అడుగుల లోతులో ఇది విజయవంతంగా ప్రయాణించింది.

అయితే, యుద్ధ రంగంలో దాడి చేయడానికి ఉపయోగించిన ప్రపంచంలోనే మొదటి సైనిక సబ్‌మెరైన్‌గా టర్టిల్ గుర్తింపు పొందింది. దీనిని 1775లో డేవిడ్ బుష్నెల్ అనే అమెరికన్ ఆవిష్కర్త తయారుచేశారు. ఈ సబ్‌మెరైన్ రెండు తాబేలు పెంకులను కలిపినట్లు ఉండటం వల్ల దీనికి టర్టిల్ అని పేరు వచ్చింది. ఇది బలమైన ఓక్ కలపతో తయారుచేయబడింది. ఇది కేవలం ఒకే ఒక్క వ్యక్తి కూర్చోవడానికి వీలుగా 10 అడుగుల పొడవు, 6 అడుగుల ఎత్తు మాత్రమే ఉండేది.

సబ్‌మెరైన్ లోపల ఉండే గాలి సుమారు 30 నిమిషాల ప్రయాణానికి సరిపోయేది. లోపల చీకటిగా ఉన్నప్పుడు నావిగేషన్ పరికరాలను చూడటానికి ఫాక్స్ ఫైర్ అనే కాంతిని వెదజల్లే ఫంగస్‌ను దిక్సూచికి పూసేవారు. నీటి అడుగునకు వెళ్లడానికి సబ్‌మెరైన్ అడుగు భాగంలో ఉన్న ట్యాంకులోకి నీటిని నింపేవారు. తిరిగి పైకి రావడానికి చేతి లేదా కాలి పంపుల ద్వారా ఆ నీటిని బయటకు నెట్టేవారు. చేతితో తిప్పే క్ర్యాంక్ ద్వారా స్క్రూ ప్రోపెల్లర్లను తిప్పుతూ ముందుకు, వెనుకకు కదిలించేవారు. శత్రు నౌకల కింద భాగానికి రంధ్రం చేసి పేలుడు పదార్థాలను అమర్చడానికి పైన ప్రత్యేకమైన డ్రిల్లింగ్ మెకానిజం ఉండేది.

ఇవి కూడా చదవండి



సాంకేతిక సమస్యల వల్ల టర్టిల్ అనుకున్న స్థాయిలో శత్రు నౌకలను నాశనం చేయలేకపోయినప్పటికీ, సముద్రపు అడుగున మానవుడు సాధించిన ఈ విజయం ఆధునిక నౌకాదళ చరిత్రలో కొత్త అధ్యాయానికి నాంది పలికింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *