కేవలం వెండితెరపైనే కాదు, డిజిటల్ ప్లాట్ఫామ్పై కూడా మీనాక్షి దూసుకుపోతోంది. సిద్ధు జొన్నలగడ్డ హీరోగా సితార సంస్థ నిర్మిస్తున్న ఒక వెబ్ సిరీస్లో కూడా ఆమె నటిస్తోందని టాక్. ఇలా ఒకే ప్రొడక్షన్ హౌస్లో ఐదు ప్రాజెక్టులు అంటే, ఆ సంస్థకు ఆమె ఎంత ‘లక్కీ’ అని భావిస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. ప్రస్తుతం ఆమె చేతిలో కార్తీ సినిమాతో పాటు నాగచైతన్య ‘వృషకర్మ’, హిందీలో ‘బాగమ్ భాగ్ 2’ వంటి పెద్ద ప్రాజెక్టులు ఉన్నాయి. గ్లామర్తో పాటు నటనలోనూ మంచి మార్కులు కొట్టేస్తున్న ఈ హర్యానా బ్యూటీ, రాబోయే రోజుల్లో టాలీవుడ్ టాప్ లీగ్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది. ఆమె స్పీడ్ చూస్తుంటే మరిన్ని క్రేజీ ఆఫర్లు రావడం పక్కా అనిపిస్తోంది.