తమిళనాడు ఎన్నికల ఫలితాల్లో విజయ్ టీవీకే పార్టీ దూసుకెళ్తోంది. టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడంతోపాటు.. మ్యాజిక్ ఫిగర్ కు చేరువలో ఉంది.. ఈ అయితే.. సరిగ్గా తమిళనాడు ఎన్నికల ఫలితాల నాడే.. సినీనటి త్రిష 44వ వసంతంలోకి అడుగుపెట్టారు. పుట్టినరోజు నాడు.. తమిళనాడు ఫలితాల ముందు తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్నారు. అయితే తమిళనాడు ఎన్నికల్లో విజయ్ TVKకు త్రిష మద్దతు తెలిపారు. అంతేకాకుండా ఈ అసెంబ్లీ ఎన్నికల్లో త్రిష-విజయ్ రిలేషన్ చర్చనీయాంశంగా మారింది. విజయ్ అధికారంలోకి వస్తే త్రిష పవర్ సెంటర్ అవుతారని ప్రచారం సైతం జరిగింది. అయితే.. అనూహ్యంగా విజయ్ గెలుపు.. త్రిష పుట్టినరోజు ఒకే నాడు రావడం పట్ల విజయ్ అభిమానుల సంబరాలు అంబరాన్నంటాయి.. ఇదిలాఉంటే.. సోషల్ మీడియాలో సైతం విజయ్, త్రిష హ్యాష్టాగ్లు ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా తమిళనాడులో ఎవరూ ఊహించని విధంగా విజయ్ పాగా వేయడం సంచలనంగా మారింది.
తిరుమలలో త్రిష ..
ఆదివారం రాత్రి తిరుమలకు చేరుకున్న త్రిష సుప్రభాత సేవలో శ్రీవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామున శ్రీవారి ఆలయంలో కనిపించిన త్రిష భక్తులను ఆకట్టుకుంది. శ్రీవారి దర్శనం అనంతరంరంగనాయకుల మండపంలో త్రిషకు వేదపండితుల ఆశీర్వచనం అందించారు. శ్రీవారి ఆలయం క్యూ లైన్ లో, ఆలయం వెలుపల ఉత్సాహంగా కనిపించిన త్రిష ను చూసేందుకు భక్తులు ఎగబడ్డారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..