మే నెల ప్రథమార్థంలో రవి, కుజ, శుక్ర, బుధులు రాశులు మారుతున్నాయి. ఏకంగా నాలుగు గ్రహాలు రాశులు మారడం వల్ల కొన్ని రాశులవారు ఒక వెలుగు వెలగబోతున్నారు. అనేక విధాలుగా అదృష్టం తలుపు తట్టే అవకాశం ఉంది. ఏప్రిల్ 30న బుధుడు మేషంలోకి, మే 14న రవి వృషభంలోకి, 12న కుజుడు మేషంలోకి, 14న మిథున రాశిలోకి మారుతున్నందువల్ల మేషం, వృషభం, సింహం, తుల, మకర, కుంభ రాశుల వారు ఆర్థికంగా, వృత్తి, ఉద్యోగాలపరంగా ఏనుగు కుంభ స్థలాన్ని బద్దలు కొట్టే అవకాశం ఉంది. జూన్ మధ్య వరకూ వీరికి తిరుగుండదు.