కరీనంగర్ జిల్లాలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. పట్టపగలే ఓ బంగారు షాపులోకి దూరిన కేటుగాళ్లు తుపాకులతో నిర్వాహకులపై కాల్పులు జరిపి అందినకాడికి దోచుకెళ్లారు. దుండగుల కాల్పుల్లో నలుగు సిబ్బంది తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు వారిని వెంటనే స్థానిక హాస్పిటల్కు తరలించారు. యాజమాన్యం ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చేపట్టారు.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.