Headlines

Vaibhav Suryavanshi: ఆడు మగోడు.. ఇలాంటోడు ఒక్కడున్నా చాలు.. మా జట్టుకు పట్టిన దరిద్రం మొత్తం పోతుద్ది..

Vaibhav Suryavanshi: ఆడు మగోడు.. ఇలాంటోడు ఒక్కడున్నా చాలు.. మా జట్టుకు పట్టిన దరిద్రం మొత్తం పోతుద్ది..


సాధారణంగా 15 ఏళ్ల వయసులో పిల్లలు క్లాస్‌రూమ్‌లలో పాఠాలు వింటూ పరీక్షల గురించి ఆందోళన చెందుతుంటారు. కానీ, వైభవ్ సూర్యవంశీ మాత్రం అందుకు పూర్తి భిన్నం. అతను పుస్తకాలకు బదులుగా బ్యాట్‌ను, పాఠాలకు బదులుగా పరుగుల వరదను ఎంచుకున్నాడు. ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ తరపున ఆడుతున్న ఈ బుడ్డోడు సృష్టించిన సునామీకి ఇప్పుడు ప్రపంచ క్రికెట్ దిగ్గజాలే ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా పాకిస్థాన్ మాజీ స్పీడ్ గన్ షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

సూర్యవంశీ ఈ సీజన్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో సెంచరీ చేశాడు. అలాగే నిన్న జరిగిన పంజాబ్ మ్యాచ్‌లోనూ 43 పరుగులతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. ఇక SRH మ్యాచ్ విషయానికొస్తే.. ఆ జట్టుతో రాజస్థాన్ రెండు మ్యాచ్‌లు ఆడింది. మొదటి మ్యాచ్‌లో డకౌట్ అయినప్పటికీ, తర్వాతి మ్యాచ్‌లో మాత్రం ఆ చేదు జ్ఞాపకాన్ని తుడిచివేస్తూ హైదరాబాద్ బౌలర్లను ఉతికి ఆరేశాడు. కేవలం 36 బంతుల్లోనే సెంచరీ మార్కును అందుకుని ఐపీఎల్ చరిత్రలో ఒక కొత్త రికార్డును నెలకొల్పాడు.

ఈ కుర్రాడి ఆట తీరును చూసిన షోయబ్ అక్తర్ ప్రశంసల జల్లు కురిపించారు. “వైభవ్ సూర్యవంశీ లాంటి ప్లేయర్ పాకిస్థాన్‌లో ఎందుకు లేడా అని అనిపిస్తోంది. ప్రపంచంలోనే అత్యున్నత బ్యాటర్‌గా అతను ఎదుగుతున్నాడు. 15 ఏళ్లకే ఇంత భయంకరంగా ఆడుతుంటే, అతని ముందు పాకిస్థాన్‌లోని ఏ ఒక్క ఆటగాడు కూడా సరిపోడు” అని అక్తర్ పేర్కొన్నారు. క్రీజులో సూర్యవంశీ ఐదారు ఓవర్లు ఉంటే చాలు బౌలర్లకు వెన్నులో వణుకు పుడుతుందని ఈ ఇంటర్వ్యూ ద్వారా చెప్పుకొచ్చాడు. క్రికెట్ భవిష్యత్తులో సూర్యవంశీ ఒక మెరిసే నక్షత్రం కాబోతున్నాడనడంలో ఎలాంటి సందేహం లేదన్నాడు.

ఇది చదవండి: ఎలిమినేట్ చేసేయండి సార్.! కింగ్‌లు అనుకుంటే బొంగు అయ్యారు.. లిస్టు చూస్తే షాకే



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *