Headlines

Actress : తెరపై నవ్వులు.. జీవితంలో కన్నీళ్లు.. హాస్యనటి కనకం చివరి రోజులు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..

Actress : తెరపై నవ్వులు.. జీవితంలో కన్నీళ్లు.. హాస్యనటి కనకం చివరి రోజులు తెలిస్తే కన్నీళ్లు ఆగవు..


తెలుగు సినిమా చరిత్రలో హాస్యనటిగా తనదైన ముద్ర వేసిన కనకం, అసలు పేరు తెలుగు కనకదుర్గమ్మ, జీవితం తెరవెనుక దాగిన పెను విషాద గాథ. 1930 నవంబర్ 12న ఒరిస్సాలోని ఖరగ్పూర్‌లో అప్పలస్వామి, షోలాపురమ్మ దంపతులకు జన్మించిన కనకం, బాల్యం నుంచే నాటకరంగంపై ఆసక్తి చూపారు. 12వ ఏట ప్రతిమ నాటకంతో తొలిసారి రంగస్థలంపై అడుగుపెట్టి, పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు. మహారాష్ట్రలో డాక్టర్‌తో నిశ్చయమైన వివాహం ఇష్టం లేక, ఇంటి నుండి పారిపోయి మద్రాసు చేరుకున్నారు. అక్కడ రచయిత తాపీ ధర్మారావు పరిచయంతో ఆమె రేడియోలో జానపద గీతాలు పాడే అవకాశం లభించింది.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఏఎన్నార్ ఛీ ఇదేం పాట అన్నారు.. అదే పాటతో చిరంజీవి బ్లాక్ బస్టర్ హిట్టు కొట్టారు..

1946లో గృహప్రవేశం చిత్రంతో వెండితెర అరంగేట్రం చేసిన కనకం, బాల వితంతువుగా నటించి మెప్పించారు. ఆ తర్వాతి కాలంలో దర్శకుడు ఎల్. వి. ప్రసాద్‌ ఆమెను ప్రోత్సహించారు. కీలుగుర్రం చిత్రంలో అక్కినేని సరసన అంజలీదేవి చెల్లి కేకిని పాత్రలో, గుణసుందరి కథలో మకరకన్యగా, షావుకారులో చాకలి రామిగా ప్రేక్షకుల మదిలో చెరగని స్థానం సంపాదించుకున్నారు. ముఖ్యంగా, గుణసుందరి కథలోని మకరకన్య పాత్ర ఆమెకు “సెక్సీ స్టార్” అనే గుర్తింపును తెచ్చింది. ఆమె నటించిన చిత్రాల్లో తన పాటలు తానే పాడుకోవడం ఆమె ప్రత్యేకత. ఎన్టీఆర్ వంటి ప్రముఖులు ఆమెను రామాక్క అని ఆప్యాయంగా పిలిచేవారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : తండ్రి సూపర్ స్టార్.. కొడుకు సెన్సేషనల్ హీరో.. సౌత్ ఇండస్ట్రీలో అమ్మాయిల ఫాలోయింగ్ ఎక్కువే..

హాస్యనటిగా ఒక వెలుగు వెలిగిన కనకం, తన కెరీర్ పీక్ స్టేజ్‌లో ఒక సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారు. 1956లో దేశదిమ్మరి అనే చిత్రాన్ని సొంతంగా నిర్మించడానికి పూనుకున్నారు. ఈ చిత్రానికి ఆమె భర్త సూరి దర్శకత్వం వహించారు. అయితే, నిర్మాణం మధ్యలోనే ఆగిపోవడం, నమ్ముకున్నవారు మోసం చేయడంతో భారీ ఆర్థిక నష్టాలను చవిచూశారు. ఈ సంఘటన ఆమె సినీ కెరీర్‌కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది, అవకాశాలు గణనీయంగా తగ్గాయి. ఒకప్పుడు కూల్‌డ్రింక్ తాగడం కోసం నెలకు 20 సార్లు బెంగళూరుకు విమానంలో వెళ్లి వచ్చేంత సంపాదన, విలాసవంతమైన జీవితం గడిపిన కనకం, ఈ సంఘటనతో తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయారు. మద్రాసులోని తన ఇల్లు, కారు, 150 తులాల బంగారం కోల్పోయారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : ఆ సినిమా హిట్టుతో ఊళ్లో ఇల్లు కట్టేసా.. పుష్ప తర్వాత ఆస్తులు ఇవే.. టాలీవుడ్ నటుడు..

అయినప్పటికీ ధైర్యం కోల్పోకుండా, నాటకరంగాన్ని ఆశ్రయించి, 1962 నుండి ఈలపాట రఘురామయ్య డ్రామా ట్రూప్‌లో చేరి చింతామణి వంటి నాటకాల్లో నటించారు. 1970లో ద్రోహి ఆమె చివరి చిత్రం. 1974లో విజయవాడకు మకాం మార్చారు. చివరి రోజుల్లో ఆమె పెంపుడు కుమార్తె అనురాధ ఆలనాపాలనా చూసుకున్నారు. ప్రముఖ గాయకుడు నాగూర్ బాబు కూడా ఆమెకు ఆర్థికంగా అండగా నిలిచారు. 1999లో తెలుగు అకాడమీ నుండి ఉగాది పురస్కారం, 2003లో మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ సన్మానం, 2004లో ఎన్టీఆర్ రంగస్థల పురస్కారం వంటి గౌరవాలు అందుకున్నారు. విజయవాడలో ఒక దశాబ్దం పాటు అనామకంగా జీవించిన కనకం 2015 జూలై 21న 85వ ఏట కన్నుమూశారు. ఆమె జీవితం, కళాకారుల అస్థిరమైన ప్రస్థానానికి, వైభవం నుండి విషాదానికి మారే పరిస్థితులకు నిదర్శనం.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : చేసిందే ఒక్క సినిమా.. దెబ్బకు తెలుగు కుర్రాళ్లను పిచ్చెక్కించేసింది.. ఈ కేరళ అందాన్ని గుర్తుపట్టారా.. ?



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *