స్థలం లేదని బాధపడుతున్నారా? 20 లీటర్ల బకెట్ ఉంటే చాలు.. మీ ఇంటి మేడపైనే కూరగాయల తోట!

స్థలం లేదని బాధపడుతున్నారా? 20 లీటర్ల బకెట్ ఉంటే చాలు.. మీ ఇంటి మేడపైనే కూరగాయల తోట!


ముందుగా బకెట్‌ను శుభ్రంగా కడగాలి. ముఖ్యంగా పెయింట్ బకెట్ అయితే కెమికల్స్ లేకుండా చూడాలి. బకెట్ అడుగు భాగంలో 3 నుండి 4 రంధ్రాలు చేయాలి. దీనివల్ల అదనపు నీరు బయటకు వెళ్లిపోయి, వేర్లు కుళ్లిపోకుండా ఉంటాయి. ఇప్పుడు బకెట్‌లో కేవలం సాధారణ మట్టిని మాత్రమే వాడకూడదు. ఎందుకంటే అది బరువుగా మారుతుంది. దానికి బదులుగా, 50శాతం తోట మట్టి, 30శాతం వర్మీ కంపోస్ట్ లేదా పశువుల ఎరువు, 20శాతం కోకోపీట్ కలిపిన మిశ్రమాన్ని వాడాలి. ఇది మట్టిని గుల్లగా ఉంచి మొక్క వేర్లు వేగంగా పెరగడానికి సహాయపడుతుంది.

ఈ పద్ధతిలో ఇదే అత్యంత ముఖ్యమైన విషయం. బకెట్‌లో స్థలం పరిమితంగా ఉన్నందున, తీగను నేలపై పాకనివ్వకుండా, దానిని పైకి కట్టండి. బకెట్ దగ్గర ఒక గోడకు లేదా పైపుకు బలమైన తాడును కట్టండి. తీగ ఒకటి రెండు అడుగుల పొడవుకు పెరిగిన తర్వాత, దానిని మెల్లగా తాడు చుట్టూ చుట్టండి. ఇది తీగ పైకి పెరగడాన్ని ప్రోత్సహించి, దానికి పుష్కలంగా సూర్యరశ్మిని అందిస్తుంది. తాడుకు వేలాడదీసిన కూరగాయలలు కూడా నిటారుగా, చక్కగా పెరుగుతాయి.

ఏయే కూరగాయలు పెంచవచ్చు?:

20 లీటర్ల బకెట్ పరిమాణం ఈ క్రింది మొక్కలకు సరిగ్గా సరిపోతుంది:

ఇవి కూడా చదవండి

టమోటా: ఒక బకెట్‌లో ఒక మొక్కను నాటితే మంచి దిగుబడి వస్తుంది.

మిరప: పచ్చిమిర్చి మొక్కలకు ఈ పరిమాణం చాలా అనువైనది.

వంకాయ: వంకాయ మొక్కలు ఏడాదంతా కాపునిస్తాయి.

తీగ జాతులు: కాకర, బీర వంటి మొక్కలు నాటి, వాటికి పైన పందిరి లాంటి సాయం అందించవచ్చు.

కూరగాయల మొక్కలకు రోజుకు కనీసం 5 నుండి 6 గంటల పాటు నేరుగా ఎండ తగలాలి. కాబట్టి బకెట్లను ఎండ తగిలే ప్రదేశంలో ఉంచాలి. మట్టి పైపొర ఆరిపోయినట్లు అనిపిస్తేనే నీరు పోయాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి కొద్దిగా ద్రవ ఎరువులు, బియ్యం కడిగిన నీరు లేదా జీవామృతం అందిస్తే మొక్కలు ఆరోగ్యంగా పెరుగుతాయి. బకెట్ గార్డెనింగ్ వల్ల తక్కువ ఖర్చుతోనే విషరహితమైన, తాజా కూరగాయలను మనం పొందవచ్చు. పాత ప్లాస్టిక్ బకెట్లను పడేయకుండా ఇలా రీసైకిల్ చేయడం పర్యావరణానికి కూడా మేలు చేస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *