Headlines

రొయ్యల వెనుక ఉన్న నల్లటి నరాన్ని ఎందుకు తొలగించాలి? ఆరోగ్యానికి కలిగే ముప్పు ఎంటో తెలిస్తే..


రొయ్యలు వండేముందు వాటి వెనుక భాగంలో ఉండే నల్లటి నరాన్ని తప్పనిసరిగా తొలగించాలి. చాలామంది దీనిని సాధారణ రక్తనాళం అనుకుంటారు. కానీ ఇది రొయ్యల జీర్ణనాళం.. దీనిని తొలగించకుండా వండితే కూర రుచి చేదుగా మారడమే కాకుండా, ఇతర సమస్యలు కూడా తప్పవు. కాబట్టి ఆరోగ్య భద్రత, రుచి కోసం వండే ముందు నల్లటి నరాన్ని తీసివేసి, రొయ్యలను క్షుణ్ణంగా శుభ్రం చేయడం శ్రేయస్కరం. అసలు ఆ నల్లటి నరం ఏమిటి?

చాలామంది ఆ నల్లటి గీతను రొయ్యల రక్తనాళం అని భావిస్తుంటారు. కానీ, అది రక్తనాళం కాదు, రొయ్యల జీర్ణనాళం. రొయ్యలు సముద్రంలో తినే చిన్న చిన్న పురుగులు, ఇసుక, వ్యర్థ పదార్థాలు ఈ నాళం గుండానే ప్రయాణిస్తాయి. అనగా ఆ నల్లటి నరంలో జీర్ణక్రియకు సంబంధించిన వ్యర్థాలు, ఇసుక నిండి ఉంటాయి.

నల్లటి నరాన్ని తొలగించకపోతే కలిగే అనర్థాలు

కూర రుచి పాడవుతుంది: నల్లటి నరంలో ఇసుక, మురికి ఉండటం వల్ల వంటకం తింటున్నప్పుడు ఇసుక తగిలి అసౌకర్యంగా ఉంటుంది. అంతేకాకుండా ఇది కూర రుచిని చేదుగా మార్చేస్తుంది.

ఇవి కూడా చదవండి



ఫుడ్ పాయిజనింగ్ ముప్పు: రొయ్య జీర్ణనాళంలో హానికరమైన బ్యాక్టీరియా, పరాన్నజీవులు ఉంటాయి. రొయ్యలను సరిగ్గా ఉడికించకపోయినా లేదా ఆ నరాన్ని తీసివేయకపోయినా, ఆ బ్యాక్టీరియా మన శరీరంలోకి చేరి ఫుడ్ పాయిజనింగ్‌కు దారితీస్తుంది.

జీర్ణకోశ సమస్యలు: ఈ వ్యర్థాలను తీసుకోవడం వల్ల కడుపునొప్పి, ఎసిడిటీ, వాంతులు, విరేచనాలు వంటి సమస్యలు వస్తాయి.

రొయ్యలను ఎలా శుభ్రం చేయాలి?:

రొయ్య పైపొర తలను తొలగించాలి. చాకు లేదా టూత్‌పిక్ సహాయంతో రొయ్య వీపు భాగంలో సన్నగా కోత పెట్టాలి. అక్కడ కనిపించే నల్లటి లేదా ముదురు రంగు నరాన్ని బయటకు లాగి వేయాలి. ఆ తర్వాత రొయ్యలను ఉప్పు, నిమ్మరసం లేదా పసుపు వేసి మంచి నీటితో శుభ్రంగా కడగాలి. ఆరోగ్యకరమైన ఆహారం కోసం రొయ్యలను వండేటప్పుడు కాస్త సమయం కేటాయించి ఆ నల్లటి నరాన్ని తప్పక తొలగించండి!

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *