Headlines

పౌడర్ రాసుకుంటేనే కూలీ.. లేదంటే..!

పౌడర్ రాసుకుంటేనే కూలీ.. లేదంటే..!


ఎండలో కాయకష్టం చేసే ఉపాధి హామీ కూలీలు, ఇప్పుడు తమ పనిముట్లతో పాటు పౌడర్ డబ్బాలను కూడా వెంట తీసుకెళ్లడం అనివార్యమైంది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్’ యాప్ నిబంధనలే ఇందుకు కారణం. ఆదిలాబాద్, ఆసిఫాబాద్ వంటి ఏజెన్సీ ప్రాంతాల్లో ఈ విచిత్ర పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం భగ్గుమనే ఎండల్లో పని చేయడం వల్ల కూలీల ముఖాలు చెమటతో జిడ్డుగా, నల్లగా మారుతున్నాయి. దీనివల్ల ఫేస్ అథెంటికేషన్ యాప్ ముఖాన్ని గుర్తించక హాజరు నమోదు కావడం లేదు. దీంతో వేతనం కోల్పోయే ప్రమాదం ఏర్పడటంతో, అక్కడి సిబ్బంది కూలీలను ముఖానికి పౌడర్ రాసుకోవాలని సూచించారు. ఆ పౌడర్ రాసుకుని తెల్లగా మారిన ముఖాలను ఫోన్ కెమెరాకు చూపిస్తేనే అటెండెన్స్ పడుతోంది. సాంకేతిక లోపాలు, సిగ్నల్ సమస్యలు, సర్వర్ మొరాయించడంతో కూలీలు పడుతున్న ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. రెండు పూటలా ఫొటోలు అప్‌లోడ్ చేయాలనే నిబంధన వీరి పాలిట శాపంగా మారింది. ఫొటో అప్‌లోడ్ కాకపోతే ఆ రోజు వేతనం కోల్పోవాల్సి వస్తోంది. కాయకష్టం చేసే పేదలను ఇలా సాంకేతిక ఇబ్బందులకు గురిచేసే ఫోటో హాజరు విధానాన్ని రద్దు చేయాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం తక్షణమే స్పందించి, ఇబ్బందులు లేని శాశ్వత పరిష్కారాన్ని చూపాలని కూలీలు వేడుకుంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Director Shankar: రజినీకి విలన్‌గా డైరెక్టర్ శంకర్

నెగెటివ్ టాక్ వచ్చినా.. కలెక్షన్స్‌లో దుమ్ములేపుతున్న ‘మైఖేల్’

Monalisa Bhosale: ప్రేమ – పెళ్లి – ఇప్పుడు గర్భవతి !! షాకు మీద షాకిస్తున్న మోనాలిసా

సుశాంత్ సూసైడ్ కేసులో.. ప్రియురాలు రియాకు బిగ్ రిలీఫ్‌

JD Chakravarthy: విష్ణు ప్రియతో రెండో పెళ్లి.. ఎట్టకేలకు నోరు విప్పిన జేడీ చక్రవర్తి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *