మజ్జిగకు ప్రాధాన్యత ఇవ్వండి: రుగులో తగినన్ని నీళ్లు పోసి బాగా చిలకాలి. అందులో చిటికెడు ఉప్పు, వేయించిన జీలకర్ర పొడి కలపాలి. ఇలా చేయడం వల్ల మజ్జిగ తేలికగా మారి, త్వరగా జీర్ణమవుతుంది. ఇది శరీరానికి అసలైన చల్లదనాన్ని ఇస్తుంది. ఫ్రిజ్ లోని చల్లటి పెరుగును నేరుగా తినకుండా, కనీసం అరగంట ముందే బయట ఉంచి అది సాధారణ ఉష్ణోగ్రతకు వచ్చాకే ఉపయోగించాలి. తీపి లస్సీ ఇష్టపడే వారు చక్కెర మోతాదును తగ్గించాలి. అతిగా తీపి ఉండే లస్సీ బరువు పెరగడానికి, నిద్రకు ఆటంకం కలిగించడానికి కారణమవుతుంది.