ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్లో వచ్చిన దేవర పార్ట్ 1 భారీ విజయం సాధించడంతో, ఇప్పుడు అందరి దృష్టి సీక్వెల్ పైనే ఉంది. నందమూరి అభిమానులు దేవర 2 కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే, కొరటాల శివ బాలకృష్ణతో తన తదుపరి చిత్రాన్ని ప్రకటించడంతో దేవర 2 ప్రాజెక్ట్ పై అనుమానాలు రేకెత్తాయి. ఈ అనౌన్స్మెంట్తో దేవర సీక్వెల్ ఉంటుందా లేదా అనే చర్చ మొదలైంది.ఈ విషయంలో తారక్ టీం స్పష్టతనిచ్చింది. దేవర 2 పక్కాగా ఉంటుందని, అది ఎటూ వెళ్ళదని పేర్కొంది. ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ ఖాళీ సమయంలో కొరటాల శివ బాలయ్యతో సినిమాను పూర్తి చేయాలని నిర్ణయించుకున్నారు.
మరిన్ని వీడియోల కోసం :
పూరీ, సురేందర్ రెడ్డి కెరీర్ను నిలబెట్టేదెవరు..?