Headlines

ఉద్యోగం చేసే ఆడవాళ్లు తినాల్సిన రాగి బూరెలు.. మెత్తగా, పొంగుతూ రావడానికి అద్భుత చిట్కాలు


పిండి మిశ్రమం సిద్ధం చేయడం : ముందుగా, ఒక బౌల్‌లో ఒక కప్పు రాగిపిండి, ఒక కప్పు గోధుమ పిండి తీసుకోవాలి. ఈ రెండు పిండిలను కలిపి వేయడం వల్ల బూరెలు మెత్తగా వస్తాయి. దీనిలో చిటికెడు ఉప్పు, 1/4 కప్పు ఎండు కొబ్బరి తురుము (లేదా పచ్చి కొబ్బరి), 2 టీస్పూన్ల నువ్వులు (వేయించనివి), 1 టీస్పూన్ యాలకుల పొడి వేసి బాగా కలపాలి. నువ్వులు ఇష్టం లేకపోతే వాటిని వేయడం మానేయవచ్చు. ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టుకోండి.స్టవ్ మీద పాన్ పెట్టి, ఒక కప్పు బెల్లం తురుము, 1/4 కప్పు నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్‌లో బెల్లం కరిగే వరకు ఉంచాలి. పాకం రానవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే కొద్దిగా బెల్లం కలుపుకోవచ్చు, తక్కువ తినేవారు తగ్గించుకోవచ్చు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *