Headlines

Vaibhav Sooryavanshi: హరారేలో బుడ్డోడి అరాచకం.. ఈసారి 31 బంతుల్లో..

Vaibhav Sooryavanshi: హరారేలో బుడ్డోడి అరాచకం.. ఈసారి 31 బంతుల్లో..


Vaibhav Sooryavanshi: భారత్, జింబాబ్వేల మధ్య జరిగిన మూడో టీ20లో వైభవ్ సూర్యవంశీ వేగవంతమైన ఆరంభాన్ని అందించాడు. హరారేలో టాస్ గెలిచి మొదట బ్యాటింగ్ ఎంచుకున్న భారత్, ఆరు ఓవర్లలో 1 వికెట్ నష్టానికి 65 పరుగులు చేసింది.

వైభవ్ సూర్యవంశీ 20 బంతుల్లో 35 పరుగులతో క్రీజులో ఉండగా, ఇషాన్ కిషన్ కూడా క్రీజులో ఉన్నాడు. అభిషేక్ శర్మ (2 పరుగులు) రూపంలో భారత్ తన మొదటి వికెట్‌ను కోల్పోయింది. అతడిని బ్లెస్సింగ్ ముజరబాని ఔట్ చేశాడు. ఆరంభంలో జరిగిన రెండు మ్యాచ్‌లలోనూ విజయం సాధించిన భారత జట్టు, సిరీస్‌లో ఇప్పటికే 2-0 ఆధిక్యం సాధించింది.

ఇరుజట్ల ప్లేయింగ్-11

భారత్: అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీ, ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), తిలక్ వర్మ, రింకూ సింగ్, సూర్యాంశ్ షెడ్గే, రవి బిష్ణోయ్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్, యశ్ ఠాకూర్.

జింబాబ్వే: బ్రియాన్ బెన్నెట్, బెన్ కర్రాన్, డియోన్ మైయర్స్, సికందర్ రజా (కెప్టెన్), ర్యాన్ బర్ల్, వెస్లీ మాధవెరె, తాడివానాషే మారుమణి, బ్రాడ్ ఎవాన్స్, న్యూమాన్ న్యామ్‌హురి, వెల్లింగ్టన్ మసకద్జా, బ్లెస్సింగ్ ముజరబానీ.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *