
Sanju Samson Century: ఐపీఎల్లో నేటి రెండవ మ్యాచ్ చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్కే) వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ) మధ్య జరుగుతోంది. చెపాక్ స్టేడియంలో డీసీ బౌలింగ్ ఎంచుకుంది. 16 ఓవర్లలో చెన్నై ఒక వికెట్ నష్టానికి 168 పరుగులు చేసింది. జట్టు తరఫున సంజు సామ్సన్, ఆయుష్ మహాత్రే క్రీజులో ఉన్నారు. వీరిద్దరూ ఇప్పటికే ఒక శతక భాగస్వామ్యాన్ని నెలకొల్పగా, అర్ధశతకాలను కూడా పూర్తి చేసుకున్నారు.
15వ ఓవర్లో సీఎస్కే 150 పరుగుల మార్కును చేరుకుంది. టి. నటరాజన్ వేసిన తొలి బంతికి సిక్సర్ కొట్టి ఆయుష్ మహాత్రే తన అర్ధశతకాన్ని పూర్తి చేసుకున్నాడు. అతను 27 బంతుల్లో తన అర్ధశతకాన్ని పూర్తిచేశాడు.
కాగా, శామ్సన్ ఆ ఓవర్లోని మూడో బంతికి సిక్సర్ కొట్టి, టీ20 క్రికెట్లో తన సిక్సర్ల సంఖ్యను 400కి చేర్చాడు.