Telangana: షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్కు గడియ వేసి..
మేడ్చల్ జిల్లా చిర్యాల్ గ్రామానికి చెందిన సుమన్ కీసరలో మొబైల్ షాప్ నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. కొంతకాలం క్రితం సెకండ్ హ్యాండ్ బైక్ను ప్రైవేట్ ఫైనాన్స్ ద్వారా కొనుగోలు చేశాడు. అయితే వ్యాపారం సరిగ్గా సాగకపోవడంతో ఈఎంఐలను క్రమం తప్పకుండా చెల్లించలేకపోయాడు. ఈ క్రమంలో ఫైనాన్సర్లు పలుమార్లు ఇంటికి వచ్చి డబ్బులు చెల్లించాలని ఒత్తిడి తీసుకువచ్చినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఇటీవల ఫైనాన్సర్లు ఇంటి వద్దకు వచ్చి నానా హంగామా చేయడంతో పరువు పోయిందని తీవ్ర మనస్తాపానికి…