ఆ రోజుల్లో ఫోన్లు అంతగా లేకపోవడంతో, మొదట పేజర్ల ద్వారా సంభాషణలు జరిగాయని కృష్ణ వంశీ గుర్తుచేసుకున్నారు. తర్వాత తను షూటింగ్ల దగ్గరికి వెళ్లడం, కలవడం, రాత్రుళ్లు స్నేహితులతో కలిసి (నందిని, రాజ్య, రవిరాజ, రామ్ వంటివారు) బయట గడపడం వంటివి చేశారని తెలిపారు. ఎవరు ముందు ప్రపోజ్ చేశారన్న ప్రశ్నకు, “ఇద్దరం ప్రపోజ్ చేయలేదు, జస్ట్ జరిగిపోయింది అంతే” అని ఆయన బదులిచ్చారు. 15 రోజులు, ఒక నెల రోజుల తర్వాత ఇద్దరికీ ఒకరిపై ఒకరికి ఏదో ఉందని గ్రహించారని చెప్పారు.