Gold Prices: అక్షయ తృతీయ వేళ బంగారం కొనాలా? 60 శాతం పెరిగిన గోల్డ్‌ రేట్లు!

Gold Prices: అక్షయ తృతీయ వేళ బంగారం కొనాలా? 60 శాతం పెరిగిన గోల్డ్‌ రేట్లు!


Gold Prices: భారతదేశంలో బంగారం కొనడం అనేది కేవలం ఆర్థికపరమైన నిర్ణయం మాత్రమే కాదు, అదొక సెంటిమెంట్. ముఖ్యంగా అక్షయ తృతీయ వంటి పర్వదినాల్లో బంగారం కొంటే ఐశ్వర్యం, అదృష్టం సిద్ధిస్తాయని భారతీయుల నమ్మకం. ఈ ఏడాది ఏప్రిల్ 19, ఆదివారం నాడు అక్షయ తృతీయ వస్తున్న తరుణంలో పసిడి మార్కెట్ విశ్లేషణను ఒకసారి పరిశీలిద్దాం.

గత ఏడాదిలో కళ్లు చెదిరే లాభాలు:

గత ఏప్రిల్ 2025 (గత అక్షయ తృతీయ) నుండి ఇప్పటివరకు భారతీయ స్పాట్ మార్కెట్‌లో బంగారం ధరలు ఏకంగా 60% పెరిగాయి. వరుసగా తొమ్మిదవ ఏడాది కూడా బంగారం పెట్టుబడిదారులకు లాభాల పంట పండించింది. ఈ ఏడాది జనవరిలో బంగారం ధర రికార్డు స్థాయిలో రూ.1,80,000 మార్కును తాకింది.

ప్రస్తుత ధర: ప్రస్తుతం లాభాల స్వీకరణ, ముడి చమురు ధరల పెరుగుదల వల్ల ద్రవ్యోల్బణ ఆందోళనల మధ్య ధర కొంత తగ్గి రూ.1,50,000 వద్ద స్థిరంగా ఉంది. అంటే గరిష్ట ధర నుండి సుమారు రూ.30,000 (16%) మేర తగ్గడం కొత్తగా పెట్టుబడి పెట్టేవారికి ఒక మంచి అవకాశంగా కనిపిస్తోంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Bank Account: ఖాతాదారులకు చివరి అవకాశం.. ఏప్రిల్ 16 లోపు ఈ పని చేయకపోతే మీ అకౌంట్ క్లోజ్ అవ్వడం ఖాయం

ప్రస్తుత డిమాండ్ పరిస్థితులు

పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో డిమాండ్ నిలకడగా ఉన్నప్పటికీ, అధిక ధరల వల్ల రిటైల్ కొనుగోలుదారులు కొంచెం ఆచితూచి అడుగు వేస్తున్నారు. సాధారణంగా అక్షయ తృతీయకు ముందు జ్యువెలర్లు భారీగా కొనుగోళ్లు చేస్తారు. కానీ ఈసారి ధరల ప్రభావం వల్ల మార్కెట్‌లో ఆశించిన స్థాయిలో సందడి కనిపించడం లేదు అని ముంబైకి చెందిన ఒక బులియన్ డీలర్ అభిప్రాయపడ్డారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా కేంద్ర బ్యాంకులు (ముఖ్యంగా చైనా సెంట్రల్ బ్యాంక్ వరుసగా 17 నెలల నుండి) బంగారాన్ని కొనుగోలు చేస్తూనే ఉండటం పసిడిపై నమ్మకాన్ని పెంచుతోంది.

పెట్టుబడిదారులకు విశ్లేషకుల సూచనలు:

ఇప్పుడున్న పరిస్థితుల్లో బంగారం కొనాలా? వద్దా? అనే సందేహాలకు నిపుణులు ఇస్తున్న సమాధానాలు ఇవే.

  • పోర్ట్‌ఫోలియో స్టెబిలైజర్: బంగారాన్ని కేవలం తక్కువ కాలంలో లాభాలు ఇచ్చే సాధనంగా కాకుండా, మీ ఆర్థిక పోర్ట్‌ఫోలియోను రక్షించే ఒక కవచంగా చూడాలని నిపుణులు సూచిస్తున్నారు.
  • భౌగోళిక ఉద్రిక్తతలు: అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చితి, వడ్డీ రేట్ల తగ్గింపు సంకేతాలు ఉన్నప్పుడు బంగారం ఎప్పుడూ సురక్షితమైన పెట్టుబడిగా ఉంటుంది.
  • దీర్ఘకాలిక ప్రయోజనం: గతంలో లాగా భారీ పెరుగుదల తక్షణమే లేకపోయినా, దీర్ఘకాలికంగా బంగారం స్థిరమైన లాభాలను అందిస్తుందని ‘ఇన్వెస్ట్ పిఎంఎస్’ బిజినెస్ హెడ్ హర్షల్ దాసాని తెలిపారు.

అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనాలనుకునే వారు, ప్రస్తుతం ధరలు కొంత తగ్గి ఉండటాన్ని ఒక అవకాశంగా భావించవచ్చు. అయితే, ఒకేసారి కాకుండా దశల వారీగా పెట్టుబడి పెట్టడం వల్ల రిస్క్ తగ్గే అవకాశం ఉంది. భౌగోళిక రాజకీయ పరిస్థితులు, గ్లోబల్ మార్కెట్ ట్రెండ్స్ బట్టి చూస్తే, బంగారానికి ఉన్న క్రేజ్ ఇప్పట్లో తగ్గేలా కనిపించడం లేదు.

Kitchen Tips: తందూర్ అక్కర్లేదు.. పెనం మీద హోటల్ స్టైల్ ‘గార్లిక్ నాన్’ చేసే సింపుల్ ట్రిక్ ఇదే!

Electric Scooters: మీరు ఎలక్ట్రిక్ స్కూటర్ కొంటున్నారా? మెరుపు వేగంతో ఛార్జింగ్ అయ్యే టాప్ 5 స్కూటర్లు ఇవే!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *