ముందుగా ఐదు నుంచి ఆరు వామాకులు మరియు ఒక స్పూన్ బియ్యాన్ని ఒక గిన్నెలో తీసుకుని, తగినంత నీటిని పోసి పొయ్యి మీద పెట్టి బాగా మరిగించాలి. ఈ నీటిని చల్లార్చి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో శనగపిండిని తీసుకుని, అందులో పావు స్పూన్ పసుపు కలపాలి. ఆ తరువాత, మరిగించి చల్లార్చిన వాము, బియ్యం నీటిని రెండు స్పూన్లు ఈ మిశ్రమంలో వేసి, పేస్ట్లా అయ్యేంత వరకు బాగా కలపాలి. ఈ విధంగా బాగా కలిపిన తర్వాత, ఈ మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించాలి. పది నిమిషాలు అలా వదిలేసి, ఆ తర్వాత ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి.