
వేసవి కాలంలో శరీరం త్వరగా అలసటకు గురవుతుంది, దాహం వేస్తుంది. ఇలాంటి సమయంలో బేల్ పండు (వెలగ పండు) నుంచి తీసిన పానీయం వడదెబ్బ తగలకుండా మనల్ని కాపాడుతుంది. బేల్ పండులో జీర్ణక్రియను మెరుగుపరిచే సహజ సమ్మేళనాలు ఉండటం వల్ల ఇది పెద్దలకు పిల్లలకు ఎంతో మేలు చేస్తుంది. ఒకే ఒక పెద్ద పండుతో పది లీటర్ల షర్బత్ తయారు చేసుకునేంత సులభమైన పద్ధతిని ఇప్పుడు చూద్దాం.
బేల్ షర్బత్ తయారీకి కావలసిన పదార్థాలు:
బేల్ పండు (వెలగ పండు): 1 పెద్దది
చక్కెర: 1 కిలోగ్రాము (రుచికి తగినట్లు)
నిమ్మరసం: 250 గ్రాములు
జీలకర్ర పొడి, చాట్ మసాలా: తగినంత
నల్ల ఉప్పు లేదా రాతి ఉప్పు: రుచికి సరిపడా
ఐస్ క్యూబ్స్: తగినన్ని
తయారీ విధానం:
ముందుగా బేల్ పండును చీల్చి, లోపల ఉన్న గుజ్జును అంతా తీయండి. దానిని చేతులతో లేదా మిక్సర్ గ్రైండర్లో వేసి మెత్తగా నూరండి. మెత్తగా చేసిన గుజ్జును నీటిలో కలిపి, ఒక జ్యూస్ స్ట్రైనర్ సహాయంతో పాత్రలోకి వడకట్టండి. ఇలా చేయడం వల్ల పీచు, గింజలు వేరుపడతాయి. వడకట్టిన రసంలో ఒక కిలో చక్కెర వేసి బాగా కరగనివ్వండి. ఆ తర్వాత నిమ్మరసం, చాట్ మసాలా, జీలకర్ర పొడి నల్ల ఉప్పు వేసి పూర్తిగా కలపండి. ఇప్పుడు ఇందులో ఐస్ క్యూబ్స్ వేసి ఒకటి రెండు నిమిషాలు ఉంచితే, చల్లని రుచికరమైన బేల్ షర్బత్ సిద్ధం!
బేల్ షర్బత్ ప్రయోజనాలు..
ఇది శరీర ఉష్ణోగ్రతను అదుపులో ఉంచుతుంది.
పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణ సమస్యలు తగ్గుతాయి.
ఎండలో తిరిగే వారికి ఇది ఒక సహజ ఎనర్జీ డ్రింక్లా పనిచేస్తుంది.
ఉపవాస సమయంలో తాగితే శరీరం త్వరగా అలసిపోదు.
గమనిక:
ఈ సమాచారం స్థానిక ఆరోగ్య నిపుణులు సంప్రదాయ పద్ధతుల ఆధారంగా రూపొందించబడింది. ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే. మీకు ఏదైనా తీవ్రమైన ఆరోగ్య సమస్యలు లేదా అలర్జీలు ఉంటే, వైద్యుని సలహా మేరకు ఆహారంలో మార్పులు చేసుకోవడం మంచిది.