ఆంధ్రప్రదేశ్ పదో తరగతి పబ్లిక్ పరీక్షల ఫలితాలు మరికాసేపట్లో విడుదల కానున్నాయి. గురువారం (ఏప్రిల్ 30) ఉదయం 11 గంటలకు విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ ఎక్స్ (ట్విట్లర్) వేదికగా ఫలితాలను విడుదల చేస్తారు. ఈ మేరకు రాష్ట్ర విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు చేసింది. ఫలితాలను అధికారిక వెబ్సైట్, మనమిత్ర వాట్సప్, లీప్ యాప్ ద్వారా పదో తరగతి ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. అలాగే టీవీ9 తెలుగు వెబ్సైట్ ద్వారా కూడా ఒకే ఒక్క క్లిక్తో టెన్త్ క్లాస్ మార్కులను తెలుసుకోవచ్చు.. విద్యార్ధులు నేరుగా తమ హాల్ టికెట్ నంబర్ ఎంటర్ చేసి ఫలితాలను పొందొచ్చు.
ఏపీ పదో తరగతి 2026 ఫలితాలు ఇక్కడ క్లిక్ చేయండి.
ఏపీ పదో తరగతి 2026 ఫలితాల కోసం ఈ కింది వెబ్సైట్ లింక్లపై క్లిక్ చేయండి.
ఈ ఏడాది మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు జరిగాయి.. ఈ పరీక్షలకు రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6.30 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు.