Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. త్వరలో ప్రతీఒక్కరికీ రూ.20 వేలు.. రెడీగా ఉండండి..

Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. త్వరలో ప్రతీఒక్కరికీ రూ.20 వేలు.. రెడీగా ఉండండి..


Andhra Pradesh: ఏపీ ప్రభుత్వం భారీ గుడ్ న్యూస్.. త్వరలో ప్రతీఒక్కరికీ రూ.20 వేలు.. రెడీగా ఉండండి..

ఏపీలోని మత్స్యకారులకు చేపల వేట నిషేధం సమయంలో ప్రతీ ఏడాది రూ.20 వేల ఆర్ధిక సాయం అందిస్తున్న విషయం తెలిసిందే. గత ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రారంభించగా.. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక కూడా అమలవుతోంది. చంద్రబాబు సర్కార్ మత్స్యకారుల సేవలో పథకం పేరుతో దీనిని అమలు చేస్తోంది. గత ఏడాదిలో అర్హులకు అందించగా.. ఈ ఏడాదికి నిధుల విడుదలకు సంబంధించి కీలక అప్డేట్ వచ్చింది. ఈ ఏడాదికి సంబంధించి లబ్దిదారుల ఎంపికను షురూ చేశారు. ప్రస్తుతం అర్హులైనవారి వివరాలను సేకరిస్తున్నారు. ఈ నెల 17వ తేదీ నుంచి అర్హుల వివరాలను సేకరించి లబ్దిదారుల జాబితా సిద్దం చేయనున్నారు. అనంతరం వారి అకౌంట్లలో ప్రభుత్వం నిధులు వేయనుంది.

చేపల వేటపై నిషేధం

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మత్స్యకారులకు చేపల వేటపై నిషేధం విధించింది. ఈ నెల 15వ తేదీ నుంచి నిషేధం అమల్లోకి రానుందని తెలిపింది. జూన్14వ తేదీ వరకు మొత్తం 61 రోజుల పాటు నిషేధం అమల్లోకి ఉండదనుందని స్పష్టం చేసింది. ఈ సమయంలో మత్స్యకారులు చేపల వేటకు వెళితే కఠిన చర్యలు తీసుకుంటారు. ఏప్రిల్ నుంచి మూడు నెలల పాటు సముద్రంలో చేపల వృద్ది జరుగుతూ ఉంటుంది. గుడ్లు పెట్టి సంతానోత్పత్తి చేస్తాయి. ఈ సమయంలో బోట్లు తిరగడం వల్ల సంతానోత్పత్తికి ఆటంకం కలుగుతుంది. దీని వల్ల ప్రతీ ఏడాది ఈ సమయంలో చేపల వేటపై ప్రభుత్వం నిషేధం విధిస్తూ ఉంటుంది. అందులో భాగంగానే ఈ ఏడాది కూడా అదే నిర్ణయం తీసుకుంది.

రూ.10 లక్షలకు పెంపు

నిబంధనలు ఉల్లంఘించి చేపల వేటకు వెళితే బోటు రిజిస్ట్రేషన్ ఏడాది రద్దు చేస్తారు. అలాగే చట్టపరంగా కూడా చర్యలు ఉంటాయని మత్స్యశాఖ తెలిపింది. మత్స్యకారులు దీనికి సహకరించాలని కోరింది. ఈ విరామ సమయంలో ప్రభుత్వం వారికి రూ.20 వేల ఆర్ధిక సాయం అందించనుంది. త్వరలో ఈ నిధులు లబ్దిదారుల ఖాతాల్లో జమయ్యే అవకాశముంది. అటు మత్స్యకారుల కోసం ఏపీ ప్రభుత్వం అనేక పథకాలు అమలు చేస్తోంది. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకంలో భాగగా ప్రమాద బీమా అందిస్తోంది. గతంలో బీమా లిమిట్ రూ.2 లక్షలు ఉండగా.. ఇప్పుడు రూ.10 లక్షలకు పెంచారు. చేపల వేటకు వెళ్లినప్పుడు ప్రమాదవశాత్తూ మరణిస్తే కుటుంబానికి రూ.10 లక్షల సాయం అందుతుంది. ఇక సహజ మరణం పొందితే రూ.2 లక్షల పరిహారం అందుతుంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *