తిరుపతి జిల్లాలోని ముక్కంటి క్షేత్రంలో వర్షం కోసం ప్రత్యేక పూజలు జరిగాయి. శ్రీకాళహస్తి ఆలయంలో వరుణ దేవుడిని వేడుకుంటూ అర్చకులు పూజలు చేశారు. మృత్యుంజయ స్వామికి సహస్ర ఘటాభిషేకం నిర్వహించారు. వర్షాలు ఆలస్యమైన సమయంలో ఒక్కటి ఆలయంలో సహస్ర ఘటాభిషేకం ఆనవాయితీగా కొనసాగుతోంది.
2015, 2019 లోను సహస్ర ఘటాభిషేకం నిర్వహించిన దేవస్థానం ఈ ఏడాది మరోసారి మృత్యుంజయ స్వామికి గంగాభిషేకం నిర్వహించింది. వర్షాభావ పరిస్థితులు తొలగిపోవాలన్న సంకల్పంతో అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు.
స్వర్ణముఖి నది, ఆలయంలోని సూర్యచంద్ర పుష్కరిణి నుంచి పవిత్ర గంగా జలాలను ఆలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చిన వేద పండితులు మృత్యుంజయ స్వామి ఆలయ పైకప్పు గుండా స్వామి వారి శివలింగం మునిగేంతగా పవిత్ర జలాలతో గంగాభిషేకం నిర్వహించారు.
మృత్యుంజయ సన్నిధి నిర్మాణం కూడా ఇందుకు వీలుగా ఉండగా వేద పండితుల మంత్రోక్షరణలతో సహస్ర ఘటాభిషేకం జరిగింది. ఆలయంలో ఓంకార నాదం మార్మోగిపోగా, అత్యంత భక్తి శ్రద్ధలతో అర్చకులు సహస్ర ఘటాభిషేకం నిర్వహించగా,పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు.
Shiva 3




