భక్తుల కోసం ఉచిత ఏసీ బస్సు..డోకిపర్రు వెంకన్న ఆలయాన్ని మరింత ప్రత్యేకంగా నిలబెట్టిన సేవల్లో ఉచిత ఏసీ బస్సు ఒకటి. సమీప ప్రాంతాల నుంచి భక్తులను ఆలయానికి ఉచితంగా తీసుకువచ్చి, దర్శనం అనంతరం తిరిగి వారి ప్రాంతాలకు చేరవేసే ఈ సేవకు విశేష స్పందన లభిస్తోంది. ముఖ్యంగా వృద్ధులు, మహిళలు, చిన్నారులకు ఇది ఎంతో ఉపయోగకరంగా మారింది. దర్శనానికి అన్ని సౌకర్యాలు..ఆలయ ప్రాంగణంలో పరిశుభ్రమైన వాతావరణం, తాగునీటి సౌకర్యం, విశ్రాంతి మందిరాలు, వాహనాల పార్కింగ్, క్రమబద్ధమైన క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. దీంతో భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకునే అవకాశం కలుగుతోంది.