విజయనగరం జిల్లా భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ఆకాశం నుంచి చూస్తే అద్భుతంగా కనిపిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ గ్రీన్ఫీల్డ్ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి ప్రతీకగా నిలుస్తోంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఘన స్వాగతం పలికేందుకు విమానాశ్రయ ప్రాంగణంలో వేలాది మంది గిరిజన కళాకారులు సంప్రదాయ థింసా నృత్యం ప్రదర్శించారు. ఏకరూప దుస్తుల్లో భారీ సంఖ్యలో కళాకారులు పాల్గొన్న ఈ థింసా నృత్య ప్రదర్శన ఇప్పటికే ప్రపంచ రికార్డు (గిన్నిస్ వరల్డ్ రికార్డు) సాధించి ప్రత్యేక గుర్తింపు పొందింది. తెలుగు సంస్కృతి, గిరిజన కళా వైభవాన్ని ప్రతిబింబించిన ఈ స్వాగత కార్యక్రమం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..