Headlines

Watch: వేగంగా దూసుకువ వస్తున్న రైలు.. పట్టాలపై చిక్కుకున్న ఎద్దు.. లోకో పైలట్ చేసిన పనికి సెల్యూట్!

Watch: వేగంగా దూసుకువ వస్తున్న రైలు.. పట్టాలపై చిక్కుకున్న ఎద్దు.. లోకో పైలట్ చేసిన పనికి సెల్యూట్!


సోషల్ మీడియాలో ప్రస్తుతం మానవత్వాన్ని ప్రతిబింబించే ఓ వీడియో లక్షలాది మందిని ఆకట్టుకుంటోంది. ఓ మూగజీవి ప్రాణాన్ని కాపాడేందుకు లోకో పైలట్ తీసుకున్న నిర్ణయం నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది. సమయపాలన కంటే ప్రాణ రక్షణ ముఖ్యమని చాటిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో వేగంగా వైరల్ అవుతోంది.

వైరల్ వీడియోలో రైలును ఢీకొన్న తర్వాత ఒక ఎద్దు ఇంజిన్ ముందు భాగం, రైల్వే పట్టాల మధ్య ఇరుక్కుపోయింది. తీవ్ర భయాందోళనకు గురైన ఎద్దు బయటపడేందుకు పదేపదే ప్రయత్నించినా సాధ్యపడలేదు. ఈ దృశ్యాన్ని గమనించిన స్థానికులు ఆందోళన చెందుతూ ఎద్దును ఎలాగైనా రక్షించాలని లోకో పైలట్‌కు సంకేతాలు ఇచ్చారు. పరిస్థితి తీవ్రతను వెంటనే అర్థం చేసుకున్న లోకో పైలట్ ఎలాంటి ఆలస్యం చేయకుండా రైలును నిలిపివేశాడు. అనంతరం ఇంజిన్ నుంచి పరిస్థితిని పరిశీలిస్తూ ఎద్దును సురక్షితంగా బయటకు తీసే ప్రయత్నాలకు సహకరించాడు. రైల్వే ట్రాక్‌కు ఇరువైపులా పెద్ద సంఖ్యలో జనం గుమిగూడి సహాయక చర్యలను గమనించగా, కొందరు ఎద్దును బయటకు తీసేందుకు ప్రయత్నించారు.

ఈ ఘటనకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో @gharkekalesh అనే ఖాతా షేర్ చేయగా, అది వేలాదిమంది దృష్టిని ఆకర్షించింది. వీడియోకు వేల సంఖ్యలో వీక్షణలు, వందలాది లైక్‌లు రావడంతో పాటు కామెంట్ సెక్షన్ ప్రశంసలతో నిండిపోయింది. “ఇదే నిజమైన మానవత్వం”, “ప్రతి ప్రాణం విలువైనదే”, “లోకో పైలట్‌కు సెల్యూట్” అంటూ నెటిజన్లు స్పందించారు. మరికొందరు “ప్రతి హీరో కేప్ ధరించడు.. కొందరు రైళ్లు నడుపుతారు” అంటూ తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

అయితే ఈ వీడియో ఎక్కడ, ఎప్పుడు చిత్రీకరించారనే విషయంపై అధికారిక సమాచారం అందుబాటులో లేదు. అయినప్పటికీ, ఒక మూగజీవి ప్రాణాన్ని కాపాడేందుకు లోకో పైలట్ చూపిన మానవత్వం, అప్రమత్తత అందరి హృదయాలను హత్తుకుంటోంది. ఈ ఘటన మరోసారి ప్రతి ప్రాణం అమూల్యమనే సందేశాన్ని గుర్తు చేసింది.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..





Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *