తీపి, పులుపు, కారాల సమతుల్యత ఈ పచ్చడికి అసలైన బలాన్ని ఇస్తుంది. చివరగా పచ్చడికి కమ్మటి తాలింపు వేసుకోవాలి. స్టవ్ మీద పాన్ పెట్టి పావు కేజీ వేరుశెనగ నూనె వేసి వేడిచేయాలి. నూనె కాగాక వెల్లుల్లి రెబ్బలు, ఆవాలు, ఎండుమిరపకాయలు, చిటికెడు ఇంగువ వేసి దోరగా వేయించాలి.