తెలుగు బుల్లితెరపై తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటీమణులలో గాయత్రి సింహాద్రి ఒకరు. బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న ప్రముఖ సీరియల్ 'కార్తీక దీపం 2 ' ద్వారా ఈమె విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. తన నటనతో, విలక్షణమైన హావభావాలతో నెగెటివ్ పాత్రలోనైనా సరే ప్రేక్షకుల మనసు దోచుకున్న గాయత్రి, సోషల్ మీడియాలోనూ నిత్యం యాక్టివ్గా ఉంటారు. తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోషూట్ పిక్స్ నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.
సినిమాలు, విభిన్నమైన కాన్సెప్ట్ ఆధారిత ఫోటోషూట్లు చేయడానికి ఇష్టపడే గాయత్రి సింహాద్రి, ఈసారి సరికొత్త గ్లామరస్ టచ్తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. రామ్ చరణ్, ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు సానా కాంబినేషన్లో వస్తున్న భారీ చిత్రం 'పెద్ది'లోని కథానాయిక జాన్వీ కపూర్ రీసెంట్గా పరిచయమైన 'అచ్చియమ్మ' పాత్ర ఆధారంగా గాయత్రి ఈ ఫోటోషూట్ చేశారు. ఈ లుక్కులో గ్లామర్ లుక్కులో అదరగొట్టేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ప్రస్తుతం ఈ పిక్స్ అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
ఈ ఫోటోలలో గాయత్రి గ్రామీణ నేపథ్యం ఉన్న సంప్రదాయ దుస్తులలో, నడుము వంపులు చూపిస్తూ ఎంతో అందంగా కనిపించారు. లంగా ఓణీ ధరించి, పల్లెటూరి పడుచు పిల్లలా కనిపిస్తూనే తన ప్రత్యేకమైన గ్లామర్తో అందరి దృష్టిని ఆకర్షించారు. జాన్వీ కపూర్ మాస్ అండ్ రోస్టిక్ లుక్ను గాయత్రి రీక్రియేట్ చేసిన తీరు నెటిజన్లను విశేషంగా అలరిస్తోంది. అటు విలన్ గా అలరిస్తున్న గాయత్రి.. ఇటు నెట్టింట క్రేజీ ఫోజులతో మతిపోగొట్టేస్తుంది.
గాయత్రి ఈ ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలలో పంచుకోగానే క్షణాల్లో వైరల్గా మారాయి. అభిమానులు, తోటి సీరియల్ నటీనటులు ఈ పిక్స్పై లైకులు, కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. “అచ్చియమ్మ పాత్రలో గాయత్రి గ్లామర్ అద్భుతంగా ఉంది”, “బుల్లితెర విలన్ ఇప్పుడు ట్రెండింగ్ హీరోయిన్ రేంజ్లో మెరిసిపోతోంది” అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
'కార్తీక దీపం' సీరియల్లో తన విలనిజంతో మెప్పించిన గాయత్రి, నిరంతరం కొత్త లుక్స్తో ప్రయోగాలు చేస్తుంటారు. మోడర్న్ డ్రెస్ల నుంచి పద్ధతిగల చీరల వరకు ప్రతీ అవుట్ఫిట్లోనూ తగిన అందాన్ని ప్రదర్శించడం ఈమె ప్రత్యేకత. ప్రస్తుతం ఈ 'పెద్ది' లుక్స్తో బుల్లితెర వీక్షకులను మాత్రమే కాక, సోషల్ మీడియా ఫాలోవర్లను కూడా ఫిదా చేస్తున్నారు. రాబోయే రోజుల్లో వెండితెరపై కూడా అవకాశాలు దక్కించుకునేలా ఆమె తన ఫోటోషూట్లతో సత్తా చాటుతోందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.




