హిందూ సంప్రదాయంలో గురు పౌర్ణమికి చాలా ప్రత్యేకత ఉంటుంది. అయితే 2026లో వచ్చేదానికి మరింత ప్రాధాన్యత ఉందని చెబుతున్నారు పండితులు. ముఖ్యంగా ఈ సంవత్సరం జూలై 29న గురు పౌర్ణమి వస్తుంది. అయితే ఇదే రోజు ప్రీతి యోగం, ఆయుష్మాన్ యోగం అనే రెండు శుభ యోగాలు ఏర్పడుతున్నాయంట. ఇది చాలా శుభప్రదమైనది అని చెబుతున్నారు పండితులు.
అందువలన ఈ గురు పౌర్ణమి రోజు చేసే పూజలకు, ప్రార్థనలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంటుంది. అంతే కాకుండా అన్ని విధాలుగా కలిసి వస్తుందని చెబుతున్నారు పండితులు. అందువలన తప్పకుండా ఈరోజు కొన్ని పనులు చేయాలంట. ముఖ్యంగా ఈరోజు లక్ష్మీదేవిని, కుబేరుడిని , వినాయకుడి పూజించడం చాలా మంచిదంట.
గురు పౌర్ణమి రోజు లక్ష్మీదేవిని పూజించడం వలన ఆర్థిక సమస్యలు తొలిగిపోయి, సంపద పెరుగుతుందంట. అంతే కాకుండా , ఈరోజు గణేశుడిని పూజించడం వలన అనుకున్న పనులు అన్నీ కూడా సకాలంలో పూర్తి అవుతాయని చెబుతున్నారు పండితులు,ఆర్థిక పరిస్థితి మెరుగు పడి, ధన లాభం కలుగుతుంది. అన్ని విధాల ప్రయోజనం చేకూరుతుందంట. అందుకే ఈరోజు వీరిని పూజించాలి.
మరీ ముఖ్యంగా కుభేరుడి పూజించడం వలన మీ ఇంట ధన వర్షం కురుస్తుందంట. అలాగే లక్ష్మీదేవికి తామర పువ్వులు సమర్పించి, విష్ణు మూర్తిని, లక్ష్మీదేవిని పూజించడం వలన ఇంటిలో సంతోషకర వాతావరణం నెలకుంటుంది. సంపద వృద్ధి చెందుతుంది. అన్నివిధాలుగా కలిసి వస్తుందంట. ఆదాయం కూడా రెట్టింపు అవుతుందంట. అలాగే సాయంత్రం తులసి కోట వద్ద దీపం పెట్టడం వలన కోరిన కోర్కెలు నెరవేరుతాయి.
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు




