వికారాబాద్ జిల్లాలోని పూడూరు మండలం రాకంచర్ల గ్రామంలో వెలిసిన శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి జాతరలో భక్తులు ఎంతో ఉత్సాహంగా పండుగను జరుపుకుంటున్న వేళ విషాదం చోటుచేసుకుంది. ఊహించని విధంగా తేనెటీగల బీభత్సం సృష్టించి, పలువురు భక్తులకు గాయాలయ్యాయి.దేశంలోని వివిధ ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు నరసింహస్వామి ఉత్సవాలకు హాజరయ్యారు. ఉదయం నుండి ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటంతో, చాలా మంది భక్తులు ఆలయ పరిసరాల్లోని చెట్ల కింద సేదతీరుతున్నారు. ఈ క్రమంలో, అకస్మాత్తుగా ఒక పెద్ద తేనెటీగల గుంపు వారిపై దాడి చేసింది. ప్రాణ భయంతో భక్తులు చెల్లాచెదురుగా పరుగులు తీయడంతో, తోపులాటలు జరిగి మరింత మంది గాయపడ్డారు.
మరిన్ని వీడియోల కోసం :