Watch Video: ఆ ఊరి VRO మూతి పళ్ళు రాలగొట్టిన ఆకతాయిలు.. మద్యం మత్తులో బరితెగింపు!

Watch Video: ఆ ఊరి VRO మూతి పళ్ళు రాలగొట్టిన ఆకతాయిలు.. మద్యం మత్తులో బరితెగింపు!


కడప, ఏప్రిల్‌ 30: కడప జిల్లా పుల్లంపేట మండలం అనాసముద్రం విఆర్వో సుబ్బరాయుడుపై ముగ్గురు యువకులు దాడి చేశారు. ఈ ఘటనలో ఆయన మూడు మూతి పళ్ళు రాలి పోయాయి. VRO భోజనం ముగించుకుని కార్యాలయం బయట రోడ్డు పక్కన స్కూటర్ ను ఆపి మూత్ర విసర్జన చేస్తున్నాడు. ఆ సమయంలో కొందరు యువకులు మద్యం సేవించి ఆటోతో విఆర్వో సుబ్బ రాయుడు స్కూటర్ ను ఢీ కొన్నారు.

దీంతో ఆగ్రహించిన సుబ్బ రాయుడు ఏరా తాగి ఉన్నారా? అని మందలించాడు. మత్తులో ఉన్న యువకులు విఆర్వో సుబ్బరాయుడు పైదాడి చేశారు. ఈ దాడిలో విఆర్వో సుబ్బరాయుడు మూడు మూతి పళ్ళు రాలిపోవడంతో పాటు తలకు బలమైన గాయాలు అయ్యాయి. ఆయనను రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. బాధితుని ఫిర్యాదు మేరకు పుల్లంపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *