Central Government: కేవలం 70 నిమిషాల్లోనే అమరావతి నుంచి హైదరాబాద్‌కు.. కేంద్రం భారీ గుడ్ న్యూస్..

Central Government: కేవలం 70 నిమిషాల్లోనే అమరావతి నుంచి హైదరాబాద్‌కు.. కేంద్రం భారీ గుడ్ న్యూస్..


ఏపీకి రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ శుభవార్త అందించారు. ఏపీకి బుల్లెట్ ట్రైన్లపై కీలక ప్రకటన చేశారు. కేంద్రం ప్రకటించిన హైస్పీడ్ బుల్లెట్ రైళ్ల కారిడార్లతో ఏపీకి ప్రయోజనం జరగనుందని తెలిపారు. బుల్లెట్ రైళ్ల కారిడార్లు పూర్తయితే కేవలం అమరావతి నుంచి హైదరాబాద్‌కు 70 నిమిషాల్లోనే చేరుకోవచ్చని స్పష్టం చేశారు. మంగళవారం విశాఖపట్నంలో జరిగిన గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. అమరావతి-హైదరాబాద్ మధ్య బుల్లెట్ ట్రైన్ కనెక్టివిటీ రాబోతుందని వెల్లడించారు. కేంద్రం ఏడు బుల్లెట్ రైళ్ల కారిడార్లను బడ్జెట్‌లో ప్రకటించిందని, వీటి వల్ల హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, అమరావతికి హైస్పీడ్ బుల్లెట్ ట్రైన్ల అనుసంధానం ఏర్పడుతుందని తెలిపారు.

2 గంటల్లోనే బెంగళూరుకు..

ఇక బుల్లెట్ రైళ్లతో చెన్నై నుంచి అమరావతికి 112 నిమిషాల్లో చేరుకోవచ్చని అశ్విని వైష్ణవ్ వివరించారు. ఇక హైదరాబాద్ నుంచి బెంగళూరుకు 2 గంటల్లోనే చేరుకోవచ్చని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలకు బుల్లెట్ రైళ్ల కనెక్టివిటీ భవిష్యత్తులో లభించనుందని, దీని వల్ల పారిశ్రామికంగా రాష్ట్రాలు అభివృద్ది చెందటమే కాకుండా ప్రయాణికులకు వేగవంతమైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుందన్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం వల్ల డబుల్ ఇంజిన్ సర్కార్ నడుస్తోందని, దీని వల్ల రాష్ట్రానికి భారీగా రైల్వే నిధులు విడుదల చేశామన్నారు. ఏపీకి రూ.10 వేల కోట్లకుపైగా నిధులు రిలీజ్ చేశామని, విశాఖ కేంద్రం కొత్త రైల్వే జోన్ అయిన దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను జూన్ 1 నుంచి నోటిఫై చేస్తామని చెప్పారు.

విశాఖకు  గూగుల్ రావడం శుభపరిణామం

దక్షిణాది రాష్ట్రాలపై కేంద్రం ఎలాంటి వివక్ష చూపడం లేదన్న అశ్విని వైష్ణవ్.. రైల్వేలు, పోర్టులు, హైవేల ప్రాజెక్టులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలను అన్యాయం చేస్తున్నామని ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. అన్ని రాష్ట్రాలకు మోదీ ప్రభుత్వం సమాన అవకాశాలు కల్పిస్తుందన్నారు. విశాఖ ఐటీ హబ్‌గా మారిందని, ఇక్కడికి గూగుల్ వంటి సంస్థ రావడం శుభపరిణామమన్నారు. ఏపీకి కేంద్రం అన్ని విధాలుగా సహయసహకారాలు అందిస్తుందని, చంద్రబాబు నాయకత్వంలో ఏపీ మరింతగా అభివృద్ది చెందుతుందని అశ్విని వైష్ణవ్ పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వంలోనే ఏపీ మరింతగా అభివృద్ది చెందుతుందన్నారు. ఏపీకి ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చుతున్నామని ఆయన అన్నారు. చంద్రబాబు నాయకత్వంలోనే ఏపీ అభివృద్ది చెందుతుందని అశ్విని వైష్ణవ్ తెలిపారు.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *