చందమామ బిస్కెట్లకు అసలైన రుచిని ఇచ్చేది నెయ్యి. ఇక్కడ ఒక చిన్న చిట్కా ఏంటంటే, నెయ్యిని కరిగించి వేయకూడదు, రూమ్ టెంపరేచర్లో ఉన్న గడ్డ నెయ్యిని మాత్రమే వాడాలి. అప్పుడే బిస్కెట్లు నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి. నీళ్లు లేదా పాలు అస్సలు వాడకుండా కేవలం నెయ్యితోనే ఈ పిండిని కలపాలి. పిండిని రెండు మూడు నిమిషాల పాటు బాగా ఒత్తుతూ కలిపితే అది వెన్నలా సాఫ్ట్గా మారుతుంది. ఈ పిండిని చూస్తుంటేనే బిస్కెట్లు ఎంత రుచిగా వస్తాయో అర్థమైపోతుంది.