హైదరాబాద్: మాజీ ఎమ్మెల్సీ కవిత కొత్త పార్టీ ఏర్పాటుపై తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ స్పందించారు. పార్టీ స్థాపించే హక్కు అందరికీ ఉందని పేర్కొన్న ఆయన, కేవలం విమర్శలు చేయకుండా, ప్రభుత్వానికి సలహాలు, సూచనలు ఇవ్వడం ద్వారా పార్టీ ఉద్దేశం మరింత స్పష్టంగా తెలుస్తుందని అభిప్రాయపడ్డారు.తెలంగాణ ప్రజల కోసం ఏం చేయదలుచుకున్నారో ముందు చెప్పాలని కవితను మంత్రి పొన్నం కోరారు. ముఖ్యమంత్రిని “కర్కోటకుడు” అని అనడం లేదా ప్రభుత్వంపై నేరుగా విమర్శలు చేయడం అధికార దాహానికి నిదర్శనమని ఆయన అన్నారు. ప్రజా సమస్యలపై పోరాడకుండా, కేవలం అధికారం కోసం కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిందించడం సరైంది కాదని స్పష్టం చేశారు.ప్రభుత్వానికి ఏవైనా లోపాలు కనిపిస్తే, వాటిని నిర్మాణాత్మకంగా తెలియజేయాలని, అప్పుడు ప్రభుత్వం వాటిని పరిశీలిస్తుందని పొన్నం ప్రభాకర్ తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల పక్షాన, కార్మికుల పక్షాన నిలబడి పనిచేస్తుందని, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకుంటుందని ఆయన హామీ ఇచ్చారు.
మరిన్ని వీడియోల కోసం :
రీ రిలీజ్లైనా చేయొచ్చుగా..సమ్మర్ను ఖాళీగా వదిలేస్తున్నారెందుకు
చిన్న సినిమాలకే పరిమితమవుతున్న తెలుగమ్మాయిలు
ధురంధర్ జోరుకు బ్రేక్ వేసిందెవరు..?
క్లాస్ టు మాస్.. మాస్ టు క్లాస్ రూటు మారుస్తున్న టాప్ స్టార్స్