ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలి.. కార్మికులను ఉద్యోగులుగా గుర్తించాలంటూ తెలంగాణలో రెండు రోజులుగా టీజీఎస్ఆర్టీసీ కార్మికుల ఆందోళన కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా డిపోల ఎదుట కార్మికులు ధర్నాలు, ఆందోళనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆర్టీసీ ఉద్యోగుల నిరసనలో ఉద్రిక్తత నెలకొంది. ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేటలో డ్రైవర్ శంకర్గౌడ్ ఆత్మహత్యాయత్నం కలకలం రేపింది. నిరసనలో పాల్గొంటున్న ఆర్టీసీ డ్రైవర్ శంకర్గౌడ్ పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకున్నారు.. దీంతో ఆయనకు గాయాలయ్యాయి.. వెంటనే కార్మికులు.. శంకర్గౌడ్ను ఎంజీఎంకు తరలించారు. 2 రోజులుగా డ్రైవర్ శంకర్గౌడ్ సమ్మెలో పాల్గొంటున్నారు.