కావాల్సిన పదార్దాలు : అర కప్పు బార్లీ, అర కప్పు పెసలు, అర కప్పు రాజ్మా గింజలు, రెండు ఉల్లిపాయలు, రెండు
టమోటాలు, రెండు పచ్చిమిర్చి, ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అర టేబుల్ స్పూన్ పసుపు, ఒక టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా నూనె, అర కట్ట కొత్తిమీరను తీసుకోవాలి.
ముందుగా కొద్దిగా బార్లీ, పెసలు, రాజ్మా గింజలను తీసుకుని 10 గంటల పాటు వాటిని బాగా నానబెట్టుకోవాలి.
ప్రెషర్ కుక్కర్లో వాటిని వేసి అర టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా ఉప్పు వేసి 6 విజిల్స్ వచ్చేవరకు బాగా ఉడికించాలి.
పాన్ లో ఆయిల్ చేసి కట్ చేసిన ఉల్లిపాయలు, నాలుగు పచ్చిమిర్చి కూడా వాటిని బాగా వేయించాలి. ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇంకా టమోటాలు కూడా వేసి మెత్తగా అయ్యేవరకు బాగా ఉడికించాలి.
ఉడికిన పప్పును దానిలో వేసి ఆ తర్వాత ఒక టేబుల్ స్పూన్ కారం, కొద్దిగా ఉప్పు వేసి వాటిని బాగా మరిగించాలి.ఇక చివర్లో కొద్దిగా కొత్తిమీరను చల్లి, కావాలంటే కొద్దిగా నిమ్మరసం కూడా వేసి వేడిగా తినడమే.




