వెండి చెంబులో నీరుపోసి పైన కొబ్బరికాయ పెట్టి కలశాన్ని ఏర్పాటు చేసి పూజ చేయాలి. అమ్మవారిని స్మరిస్తూ, ఆవు నెయ్యితో దీపం వెలిగించి, హారతి ఇవ్వాలి. ఈరోజు తప్పకుండా లక్ష్మీ అష్టోత్తర శతనామావళిని చదవాలి. అలాగే అమ్మవారికి పాయసం నైవేద్యం పెట్టాలి. అంతే కాకుండా పూలు, గాజులు, చీర, పండ్లు కూడా పెట్టొచ్చు. ఇలా నిష్టగా, భక్తి శ్రద్ధలతో అమ్మవారికి పూజ చేయడం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ఇంటిలో సంపద పెరుగుతుంది.