టాలీవుడ్ లవబుల్ కపుల్ విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నా. కొన్నాళ్లుగా ప్రేమలో ఉన్న వీరిద్దరు ఇప్పుడు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు. గత నెల వీరిద్దరి వివాహ వేడుక ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే.
ఫిబ్రవరి 26న రాజస్థాన్ లోని ఉదయ్ పూర్ లోని ఐటీసీ మెమోంటో హోటల్లో వీరిద్దరి వివాహ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితులు, పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు.
అనంతరం వీరిద్దరు వివాహ రిసెప్షన్ మార్చి 4న హైదరాబాద్ లోని తాజ్ హోటల్లో ఘనంగా జరిగంది. ఈ వేడుకకు సినీ, రాజకీయ ప్రముఖులు, సన్నిహితులు హాజరయ్యారు. అంతుకు ముందు విజయ్ సొంతూరిలో సత్యనారాయణ వ్రతం చేసింది విరోష్ జంట.
అలాగే విజయ్ తన సొంతూరిలో గ్రామస్తులకు వివాహ విందు ఏర్పాటు చేశారు. అనంతరం తమ పెళ్లి, సంగీత్ వేడుకలకు సంబంధించిన ఫోటోలను ఈ జంట సోషల్ మీడియాలో పంచుకున్నారు. అలాగే రిసెప్షన్ ఫోటోస్ సైతం షేర్ చేశారు.
తాజాగా విజయ్, రష్మిక తమను పెళ్లి కొడుకుగా, పెళ్లి కూతురిగా చేసే వేడుకలకు సంబంధించిన ఫోటోలను షేర్ చేశారు. ఆ ఫోటోలలో విజయ్, రష్మిక ఎంతో అందంగా కనిపిస్తున్నారు. ఆ ఫోటోలలో విజయ్, రష్మిక ఇద్దరు ఒకేరకమైన దుస్తులను ధరించారు.
విజయ్ దేవరకొండ, రష్మిక కలిసి ఇదివరకు గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాల్లో నటించారు. ఈ రెండు సినిమాలతో వీరికి హిట్ పెయిర్ గా ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కలిగి ఉన్నారు. వీరి జంటను అభిమానులు విరోష్ అని పిలుచుకునేవాళ్లు.
ప్రస్తుతం వీరిద్దరు కలిసి మరోసారి వెండితెరపై సందడి చేయబోతున్నారు. ఇద్దరూ ప్రధాన పాత్రలలో నటిస్తున్న లేటేస్ట్ మూవీ రణబాలి. ఇదివరకు విడుదలైన పోస్టర్స్ ఆకట్టుకోగా.. ఇటీవలే రిలీజ్ అయిన ఏందయ్యా సామీ పాటకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.






