శనివారం శ్రీ వెంకటేశ్వర స్వామికి అత్యంత ప్రీతికరమైన రోజుగా పరిగణించబడుతుంది. ప్రతిరోజు దీపారాధన చేయలేని వారు కనీసం ప్రతి శనివారం ఇంట్లో దీపారాధన చేస్తే వెంకటేశ్వర స్వామి అనుగ్రహంతో సిరిసంపదలు లభిస్తాయి. శనివారం చేసే పూజలు కోటి జన్మల పుణ్యఫలాన్ని అందిస్తాయి. జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, శనివారం చెప్పబడిన నియమాలను పాటిస్తే సమస్యలు క్షణాల్లో తీరిపోయి, ఊహించలేనంత ఐశ్వర్యం పొందవచ్చు. పిండి దీపం అత్యంత శక్తివంతమైన దీపాలలో ఒకటి. ఇది వెంకటేశ్వర స్వామికి చాలా ఇష్టమైనది. ప్రతి శనివారం పిండి దీపం వెలిగిస్తే త్వరలోనే ధనవంతులు అవుతారు. పిండి దీపాన్ని తయారు చేయడానికి బియ్యప్పిండి, బెల్లం తురుము, కొద్దిగా ఆవు నెయ్యి కలిపి నీళ్లు పోసి చపాతి ముద్దలా కలపాలి. ఈ పిండితో ప్రమిదను తయారుచేసి, కుంకుమ బొట్టు పెట్టి, ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనె పోసి ఏడు వత్తులతో వెంకటేశ్వర స్వామి పటం ముందు వెలిగించాలి. పిండి దీపం వెలిగించిన వెంటనే ముక్కోటి దేవతలు ప్రత్యక్షమవుతారని నమ్మకం.