Headlines

వల వేసేముందు నక్కతోక తొక్కాడో ఏమో.. ఏంది గురూ ఈ చేపలు..


శ్రీశైలం బ్యాక్ వాటర్ లో వేటకు వెళ్లిన ఓ జాలరికి అదృష్టం తలుపుతట్టింది. సాధారణంగా దొరికే చేపల స్థానంలో ఏకంగా భారీ బొచ్చ చేపలు వలకు చిక్కడంతో అతడి ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం షేక్ పల్లి గ్రామానికి చెందిన జాలరి వినోద్ కృష్ణ రెండు రోజుల క్రితం శ్రీశైలం బ్యాక్ వాటర్ లో చేపల వేటకు వెళ్లాడు. ఎప్పటిలాగే వల విసరగా కొద్దిసేపటికే బరువెక్కింది. దీంతో వలలో పెద్ద మొత్తంలో చేపలు చిక్కినట్లు భావించాడు. తీరా వలను బయటకు తీసి చూడగా ఒకటి కాదు… రెండు కాదు ఏకంగా ఐదు భారీ బొచ్చ చేపలు కనిపించాయి.

ఒక్కో చేప సుమారు 30కిలోల బరువు ఉన్నట్లు మత్స్యకారులు చెబుతున్నారు. దీంతో వినోద్ కృష్ణ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇంత పెద్ద బొచ్చ చేపలు వలకు చిక్కడం అరుదని, అలాంటిది ఒకేసారి ఐదు చేపలు దొరకడం నిజంగా అదృష్టమేనని తోటి జాలర్లు చెబుతున్నారు. భారీ చేపలు దొరకడంతో సంతోషంలో ఉన్న వినోద్ కు మరో గుడ్ న్యూస్ ఎదురైంది. ఈ బొచ్చ చేపలకు మార్కెట్‌లో మంచి ధర పలకడంతో ఒకే వేటలో భారీగా ఆదాయం వచ్చే అవకాశం లభించింది. దీంతో వినోద్ కృష్ణకు నిజంగానే పంట పండినట్టైంది.

వీడియో చూడండి..

శ్రీశైలం బ్యాక్ వాటర్ లో వలకు చిక్కిన ఈ భారీ బొచ్చ చేపల విషయం స్థానికంగా ఆసక్తికరంగా మారింది. పెద్ద చేపలను చూసేందుకు స్థానికులు, తోటి జాలర్లు ఆసక్తి చూపించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *