
చాలా రోజులుగా సినీ ప్రియులను సస్పెన్స్లో ఉంచిన బయోపిక్ల నటీనటులపై క్లారిటీ వచ్చేసింది. ఇండియన్ ఫేమస్ సింగర్ ఎమ్మెస్ సుబ్బలక్ష్మి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రంలో పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక మందన్న నటించనున్నారు. జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి ఈ బయోపిక్ను తెరకెక్కించనున్నారు. ఇప్పటికే రష్మికతో లుక్ టెస్ట్ కూడా పూర్తైనట్లు తెలుస్తోంది. అల్లు అరవింద్, రాక్లైన్ వెంకటేష్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.మరోవైపు, ప్రముఖ బాలీవుడ్ నటి శ్రద్ధా కపూర్ కూడా బయోపిక్లో నటించేందుకు సిద్ధమయ్యారు. జానపద కళాకారిణి, డాన్సర్, తమాషా మహారాణిగా గుర్తింపు పొందిన విఠాబాయ్ నారాయణ్ గావ్కర్ జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఛావా ఫేమ్ లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈఠా అనే టైటిల్తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. మహారాష్ట్రలోని వివిధ ప్రాంతాల్లో భారీ షెడ్యూల్స్ ప్లాన్ చేస్తున్నారు.