జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, పసుపు రంగు బృహస్పతి (Jupiter) గ్రహంతో ముడిపడి ఉంది. ఈ పూలు ముఖ్యంగా వినాయకుడు, లక్ష్మీదేవి, విష్ణుమూర్తికి అత్యంత ప్రీతికరమైనవి. బుధవారం నాడు గణపతికి బంతి పూలు సమర్పించడం వల్ల బుద్ధి వికాసం చెందుతుందని, పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయని అంటారు.. శుక్రవారం లక్ష్మీదేవికి ఈ పూలు అర్పించడం వల్ల ఆర్థిక స్థితి మెరుగుపడుతుందని, గురువారం విష్ణుమూర్తికి సమర్పించడం వల్ల జ్ఞానం, సంతాన సుఖం కలుగుతాయని జ్యోతిశాస్త్రం చెబుతోంది. ఏ శుభకార్యమైనా నిర్విఘ్నంగా సాగడానికి బంతి పూల మాలలు అలంకరించడం ఆనవాయితీగా వస్తోంది.