ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. బస్సులో లగేజ్‌ మర్చిపోయారా.. టెన్షనొద్దు! జస్ట్ ఇలా చేయడంతే

ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. బస్సులో లగేజ్‌ మర్చిపోయారా.. టెన్షనొద్దు! జస్ట్ ఇలా చేయడంతే


ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. బస్సులో లగేజ్‌ మర్చిపోయారా.. టెన్షనొద్దు! జస్ట్ ఇలా చేయడంతే

ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించే సమయంలో కొన్ని సార్లు కంగారులో బస్సులోనే వస్తువులు మర్చిపోయి దిగిపోతుంటారు ప్రయాణికులు. కొన్ని సందర్భాల్లో ఆ వస్తువులు తిరిగి అప్పగిస్తుంటారు. మరి కొన్నిసార్లు మాత్రం అవి మనవరకు చేరవు. ఇక వాటిపై ఆశలు వదిలేసుకోనే పరిస్థితులు వస్తాయి.ఈ సమస్యపై దృష్టి సారించిన ఏపీఎస్‌ఆర్టీసీ సరికొత్త విధానాన్ని అమల్లోకి తెచ్చింది.ప్రయాణికులు మర్చిపోయిన వస్తువులను తిరిగి వాళ్లకు అప్పగించేందుకు లాస్ట్ ప్రాపర్టీ హ్యాండోవర్ అనే విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఈ విధాన్ని అమలు చేసేందుకు రాష్ట్రవ్యాప్తంగా హెల్ప్‌ డెస్క్‌ టోల్‌ ఫ్రీ నంబర్లను సైతం ఏర్పాటు చేసింది.

ఏపీ బస్సులో లగేజ్ మర్చిపోతే కాల్ చేయాల్సిన నెంబర్

పొరపాటున ఎవైన తమ వస్తువులను బస్సులో మర్చిపోతే వారు వెంటనే ఆర్టీసీ టోల్‌ ప్రీ నెంబర్.. 0866-2670005 ఫోన్‌ చేయాలని అధికారులు చెబుతున్నారు. ఈ హెల్ప్ డెస్క్ 24 గంటలు అందుబాటులో ఉంటుందని చెబుతున్నారు. అయితే మీ వస్తువు మర్చిపోయామని మీరు టోల్‌ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసినప్పుడూ ఏ డిపో బస్సులో ప్రయాణించారు, ఎక్కడ దిగిపోయారు, మీరు మర్చిపోయిన లగేజి ఏంటి, టికెట్‌పై ఉండే డ్రైవర్, కండక్టర్ వివరాలు తెలియజేయాల్సి ఉంటుంది.

తెలంగాణ బస్సులో లగేజ్ మర్చిపోతే కాల్ చేయాల్సిన నెంబర్

మీరు వివరాలు చెప్పిన వెంటనే హెల్ప్‌ డెస్క్‌ సెంటర్‌ నుంచి సదురు డిపోకు కాల్ చేసి ప్రయాణికుడి వివరాలు నిర్ధారించుకుని వారి వస్తువులను వారికి తిరిగి అప్పగిస్తారు. ఒక వేళ మీరు టికెట్‌ను మిస్ చేసుకుంటే నేరుగా డిపోకు వెళ్లి సమాచారం ఇవ్వవచ్చు. మీరు తెలంగాణకు సంబంధించిన బస్సులో లగేజ్ మర్చిపోయి ఉంటే “040-69440000 నెంబర్‌కు కాల్ చేసి సమాచారం అందించాలి.

లగేజ్ విషయంలో జాగ్రత్త

ఈ మధ్య కాలంలో చాలా మంది ప్రయాణికులు బస్సులో తమ విలువైన వస్తువులను మర్చిపోతూ ఉన్నారు. వాటిలో బంగారు, వెండి ఆభరణాలు, డబ్బులు సైతం ఉంటున్నాయి. ఆర్టీసీ డ్రైవర్‌, కండక్టర్లు సైతం నిజాయితీగా వాటిని డిపోలో అందిస్తున్నారు. అక్కడి సిబ్బంది బాధితుల వివరాలు తెలుసుకొని వారికి తమ వస్తువులను చేరవేస్తున్నారు. అంతేకాదు తమ లగేజ్, వస్తువల విషయంలో ప్రయాణికులు సైతం జాగ్రత్తగా ఉండాలని ఆర్టీసీ అధికారులు సూచిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *