తక్కువ ఖర్చులో ఎక్కువ డేటా, వినోద సేవలను అందించే దిశగా రిలయన్స్ జియో కొత్తగా రూ.200 లోపు ఆరు ప్రీపెయిడ్ యాడ్-ఆన్ రీఛార్జ్ ప్లాన్లను ప్రవేశపెట్టింది. ఈ ప్లాన్లు ప్రధానంగా క్రికెట్ వీక్షణ, OTT స్ట్రీమింగ్, అదనపు డేటా అవసరాలను దృష్టిలో పెట్టుకొని రూపొందించారు. కంపెనీ ఈ ప్యాక్లను క్రికెట్ డేటా ప్యాక్లుగా వర్గీకరించింది. ఇవి స్వతంత్ర రీఛార్జ్లు కాకుండా యాడ్-ఆన్లుగా పనిచేస్తాయి. అంటే కాల్స్, SMS, బేసిక్ మొబైల్ సేవల కోసం తప్పనిసరిగా యాక్టివ్ బేస్ ప్లాన్ ఉండాలి.
ఈ సిరీస్లో అత్యంత ప్రీమియం ప్లాన్ రూ.195గా ఉంది. ఇందులో 15GB హై-స్పీడ్ డేటా, 90 రోజుల జియో హాట్స్టార్ సబ్స్క్రిప్షన్, కొంత టాక్టైమ్ లభిస్తాయి. ఇది 30 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. క్రికెట్, OTT కంటెంట్ ఎక్కువగా చూసే వినియోగదారులను లక్ష్యంగా చేసుకుంది. రూ.149 ప్లాన్లో 10GB డేటాతో పాటు అదే 90 రోజుల OTT యాక్సెస్ అందించబడుతోంది. రూ.139 ప్లాన్ మాత్రం తక్కువ కాలపరిమితిలో ఎక్కువ డేటా అవసరమయ్యే వినియోగదారులకు అనుకూలంగా 7 రోజుల్లో 12GB డేటాను అందిస్తుంది.
ఇంకా చౌకైన ఎంపికల్లో రూ.100, రూ.79 ప్లాన్లు ఉన్నాయి. వీటిలో వరుసగా 6GB, 3GB డేటాతో పాటు 30 రోజుల OTT సబ్స్క్రిప్షన్ లభిస్తుంది. ఇవి తక్కువ వినియోగదారులు లేదా సాదారణ స్ట్రీమింగ్ అవసరాలకు సరిపోతాయి. అత్యల్ప ధరలో ఉన్న రూ.49 ప్లాన్ అత్యవసర డేటా అవసరాల కోసం రూపొందించారు. ఇందులో 1 రోజుకు సరిపడే భారీ డేటా ప్యాక్ అందుబాటులో ఉంటుంది. మొత్తంగా ఈ కొత్త ఆఫర్లతో రిలయన్స్ జియో తక్కువ ధరలో డేటా వినియోగం, డిజిటల్ వినోదాన్ని మరింత విస్తృతంగా అందించేందుకు ప్రయత్నిస్తోంది. అయితే ఇవి యాడ్-ఆన్ ప్యాక్లు కావడంతో, పూర్తి సేవల కోసం బేస్ రీఛార్జ్ అవసరం అని కంపెనీ స్పష్టం చేసింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి