ఎన్‌డీఏకు అందని ‘మ్యాజిక్ ఫిగర్’.. లోక్‌సభలో వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు

ఎన్‌డీఏకు అందని ‘మ్యాజిక్ ఫిగర్’.. లోక్‌సభలో వీగిపోయిన మహిళా రిజర్వేషన్ బిల్లు


లోక్‌సభలో మహిళా రిజర్వేషన్ల వేగవంతమైన అమలుకు ఉద్దేశించిన కీలక బిల్లు చుక్కెదురైంది. 131వ రాజ్యాంగ సవరణ వీగిపోయింది. కొత్త జనాభా గణనతో సంబంధం లేకుండానే నియోజకవర్గాల పునర్విభజన చేపట్టి, మహిళా కోటాను వెంటనే అమలు చేయాలన్న ప్రతిపాదనను లోక్‌సభ తిరస్కరించింది. శుక్రవారం (ఏప్రిల్ 17) జరిగిన ఈ ఉత్కంఠభరిత ఓటింగ్‌లో మొత్తం 489 మంది ఎంపీలు పాల్గొన్నారు. బిల్లు ఆమోదం పొందడానికి ఎన్‌డీఏ ప్రభుత్వానికి 326 ఓట్లు అవసరం కాగా, కేవలం 298 ఓట్లు మాత్రమే అనుకూలంగా వచ్చాయి. 230 మంది సభ్యులు వ్యతిరేకంగా ఓటు వేయడంతో బిల్లు వీగిపోయింది. జనాభా గణన ప్రక్రియను దాటవేసి పునర్విభజన చేయాలన్న ప్రభుత్వ ప్రయత్నానికి ఈ ఫలితం గట్టి విఘాతంగా మారింది. దీంతో మహిళా రిజర్వేషన్ల అమలుపై సందిగ్ధత నెలకొంది.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *