హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి కొండా కుటుంబం పేరు హాట్టాపిక్గా మారింది. మాజీ మంత్రి, కాంగ్రెస్ ఎమ్మెల్యే కొండా సురేఖ సోషల్ మీడియాలో చేసిన తాజా పోస్ట్ రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. “ఇక నిరీక్షణ ముగిసింది.. అతి త్వరలో నిర్ణయం ప్రకటిస్తా” అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలతో తదుపరి అడుగు ఏంటి? అనే చర్చ మొదలైంది.
మంత్రి పదవి నుంచి తొలగించిన తర్వాత కొండా సురేఖ గతంలో కీలక వ్యాఖ్యలు చేశారు. తాను కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయబోనని, ఎమ్మెల్యేగా కొనసాగుతూ తన నియోజకవర్గ ప్రజలకు సేవ చేస్తానని స్పష్టం చేశారు. అయితే ఇప్పుడు ఆమె చేసిన తాజా పోస్టుతో తన నిర్ణయంపై పునరాలోచన చేస్తున్నారా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

Konda Surekha Shock Post
ఇదే సమయంలో కొండా సురేఖ భర్త కొండా మురళి ఇటీవల చేసిన వ్యాఖ్యలు, ప్రదర్శించిన దూకుడు కూడా రాజకీయ చర్చకు కారణమయ్యాయి. దీంతో కొండా కుటుంబం కాంగ్రెస్లోనే కొనసాగుతుందా? లేక మరో రాజకీయ నిర్ణయం తీసుకుంటుందా? అనే ఉత్కంఠ నెలకొంది.
కొండా సురేఖ రాజకీయ ప్రస్థానంలో గతంలోనూ పలు సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి మరణం తర్వాత వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిని చేయాలనే డిమాండ్కు మద్దతుగా ఆమె అప్పటి పరిణామాల్లో కీలకంగా వ్యవహరించారు.
అయితే ప్రస్తుతం కాంగ్రెస్కు గుడ్బై చెప్పడం, మరో పార్టీలో చేరడం వంటి అంశాలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాబట్టి ఆమె “బిగ్ అప్డేట్” ఏంటన్నది వెల్లడయ్యే వరకు ఊహాగానాలు మాత్రమే కొనసాగనున్నాయి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..