ముందుగా అపోలో ఫిష్ తీసుకుని, వాటికి ఉప్పుతో వేసి ఒకటికి మూడు సార్లు బాగా శుభ్రపరచుకోవాలి. ఇలా చేస్తే చేపలు నీచు వాసన రాకుండా ఉంటాయి.
ఈ ముక్కలకు మసాలాలు పట్టించుకోవాలి: ఆ తర్వాత ఈ ముక్కలను తీసుకుని ఒక టేబుల్ స్పూన్ అల్లం-వెల్లుల్లి పేస్ట్, పసుపు, రుచికి సరిపడా ఉప్పును వేసి పక్కన పెట్టుకోవాలి.
మ్యారీనేట్ చేసిన అపోలో ఫిష్ ముక్కలను ఒక గిన్నెలోకి తీసుకుని కొద్దిగా కారం, మసాలా పొడి , అర టీ స్పూన్ ధనియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం కూడా వేసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.
ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని దానిలో అపోలో ఫిష్ చేప ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ శనగపిండి, నాలుగు కరివేపాకు ఆకులు , కొద్దిగా నీళ్ళు పోసి మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి.
ఇక చివర్లో గ్యాస్ స్టవ్ వెలిగించి పొయ్యి మీద పాన్ పెట్టి దానిలో ఆయిల్ వేసి, శనగ పిండి పట్టించిన చేప ముక్కలను తీసుకుని గోల్డ్ కలర్లోకి మారే వరకు వాటిని బాగా వేయించుకోవాలి.




