
హైదరాబాద్, మార్చి 6: యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (CSE) 2026 తుది ఫలితాలు శుక్రవారం (మార్చి 6) మధ్యాహ్నం విడుదలయ్యాయి. తాజా ఫలితాల్లో మొత్తం 958 మంది అభ్యర్ధులు అఖిల భారత సివిల్ సర్వీసులకు ఎంపికయ్యారు. ఇందులో టాప్ 10 ర్యాంకర్ల లిస్టును యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో ఉంచింది. టాపర్స్ జాబితాలో ఆల్ ఇండియా ర్యాంక్ (AIR), రోల్ నంబర్, పరీక్షలో అగ్రస్థానంలో నిలిచిన అభ్యర్థుల పేరు వంటి ముఖ్యమైన వివరాలు మాత్రమే ఇచ్చింది. మార్కుల జాబితాను త్వరలోనే విడుదల చేయనున్నట్లు పేర్కొది. రాజస్థాన్ కు చెందిన అనుజ్ అగ్నిహోత్రి ఫస్ట్ ర్యాంకు సాధించి సత్తా చాటారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన సమాచారం ప్రకారం ఉత్తీర్ణత సాధించిన 958 మందిలో 180 మంది అభ్యర్థులు ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ (IAS), 55 మంది ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS), 150 మంది ఇండియన్ పోలీస్ సర్వీస్ (IPS)లో చేరతారు. అయితే 180 IAS పోస్టుల్లో 74 స్థానాలు అన్రిజర్వ్ చేశారు. ఇందులో 28 పోస్టులు షెడ్యూల్డ్ కులాలకు, 13 పోస్టులు షెడ్యూల్డ్ తెగలకు, 47 OBCలకు, 18 పోస్టులు EWS కేటగిరీకి రిజర్వ్ చేసినట్లు యూపీఎస్సీ తెలిపింది.
యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
UPSC తుది ఫలితం 2025 టాపర్స్ లిస్ట్..
- అనుజ్ అగ్నిహోత్రి (రోల్ నంబర్ 131589)
- రాజేశ్వరి సువే M (రోల్ నంబర్ 4000040)
- అకాన్ష్ ధుల్ (రోల్ నంబర్ 3512521)
- రాఘవ్ ఝుంఝుంవాలా (రోల్ నంబర్ 0834732)
- ఇషాన్ భట్నగర్ (రోల్ నంబర్ 0409847)
- జిన్నియా అరోరా (రోల్ నంబర్ 6410067)
- అర్ రాజా మొహైదీన్ (రోల్ నంబర్ 0818306)
- పక్షల్ సీక్రెట్ (రోల్ నంబర్ 0843487)
- అస్తా జైన్ (రోల్ నంబర్ 0831647 )
- ఉజ్వల్ ప్రియాంక్ (రోల్ నంబర్ 1523945)
కాగా మొత్తం 1087 సివిల్ సర్వీసెస్ పోస్టులకు గత ఏడాది నోటిఫికేషన్ విడుదలవగా.. ప్రిలిమినరీ పరీక్ష గత ఏడాది మే 25న జరిగింది. మెయిన్ పరీక్ష ఆగస్టు 22 నుంచి ఆగస్టు 31, 2025 వరకు జరిగింది. మెయిన్ పరీక్ష తర్వాత 2,736 మందిని ఇంటర్వ్యూలకు పిలిచారు. చివరి రౌండ్ పరీక్ష అయిన పర్సనాలిటీ టెస్ట్ (ఇంటర్వ్యూ) జనవరి 5న ప్రారంభమై ఫిబ్రవరి 27, 2026న ముగిసింది. ఫలితాలు ప్రకటించిన 15 రోజుల్లోపు మార్కులు UPSC వెబ్సైట్లో కమిషన్ అప్లోడ్ చేస్తుంది.
యూపీఎస్సీ సివిల్స్ ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.