UPSC Jobs 2025: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలకు యూపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల.. నెలకు రూ.లక్షల్లో జీతం

UPSC Jobs 2025: కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలకు యూపీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల.. నెలకు రూ.లక్షల్లో జీతం


దేశవ్యాప్తంగా రైల్వే, టెలికాం, డిఫెన్స్‌ సర్వీస్‌ తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాలు, శాఖల్లో ఖాళీగా ఉన్న ఇంజినీరింగ్‌ ఉద్యోగాలు భర్తీకి ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌ 2026 నోటిఫికేషన్‌ను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్‌ కింద మొత్తం 474 పోస్టులను భర్తీ చేయనుంది. సివిల్‌ ఇంజినీరింగ్‌, మెకానికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రానిక్స్‌, టెలీకమ్యూనికేషన్‌ ఇంజినీరింగ్‌ విభాగాల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఆన్‌లైన్‌ దరఖాస్తులు ఇప్పటికే ప్రారంభమైనాయి. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఈ కింది డైరెక్ట్ లింక్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

యూపీఎస్సీ- ఇంజినీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్‌-2026కు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్ చ‌దివి ఉండాలి. లేదా ఇన్‌స్టిట్యూషన్ ఆఫ్ ఇంజినీర్స్(ఇండియా) ఇన్‌స్టిట్యూట్ ఎగ్జామినేషన్స్ ఎ, బి విభాగాలు ఉత్తీర్ణత సాధించి ఉండాలి. లేదా ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా అసోసియేట్ మెంబర్‌షిప్ ఎగ్జామినేషన్ పార్ట్స్ 2, 3/ సెక్షన్లు ఎ, బి అర్హత సాధించాలి. లేదా ఎలక్ట్రానిక్స్ & టెలికమ్యూనికేషన్ ఇంజినీర్స్ ఇన్‌స్టిట్యూషన్(ఇండియా) గ్రాడ్యుయేట్ సభ్యత్వ పరీక్షలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. లేదా ఎంఎస్సీ(వైర్‌లెస్‌ కమ్యూనికేషన్‌ ఎలక్ట్రానిక్స్‌, రేడియో ఫిజిక్స్‌, రేడియో ఇంజినీరింగ్‌) ఉత్తీర్ణులై ఉండాలి. అలాగే అభ్యర్థుల వయసు జనవరి 1, 2026 నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. ఆసక్తి కలిగిన వారు ఆన్‌లైన్‌ ద్వారా అక్టోబర్‌ 16, 2025వ తేదీలోపు దరఖాస్తు చేయాలి. దరఖాస్తు ఫీజు కింద జనరల్‌ అభ్యర్ధులు రూ.200 చెల్లించాలి. మహిళా/ ఎస్సీ /ఎస్టీ/ పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఎలాంటి ఫీజు చెల్లించనవసరం లేదు. ప్రిలిమినరీ, మెయిన్స్ రాత పరీక్షలు, పర్సనాలిటీ టెస్ట్‌, మెడికల్‌ ఎగ్జామినేషన్‌, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ పరీక్ష తేదీ ఫిబ్రవరి 8, 2026న ఉంటుంది.

ఎంపిక విధానం ఇలా..

ప్రిలిమినరీ పరీక్ష 2 పేపర్లకు మొత్తం 500 మార్కులకు ఉంటుంది. పేపర్ 1 పరీక్ష 200 మార్కులకు రెండు గంటల సమయంలో ఉంటుంది. పేపర్ 2 పరీక్ష 300 మార్కులకు 3 గంటల సమయంలో ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన వారికి మెయిన్ పరీక్ష రెండు పేపర్లకు మూడు గంటల వ్యవధిలో మొత్తం 600 మార్కులకు ఉంటుంది. ఇంటర్వ్యూ 200 మార్కులకు ఉంఉటంది. మొత్తం 1300 మార్కులకు నియామక ప్రక్రియ ఉంటుంది.

ఇవి కూడా చదవండి

ఇతర వివరాలకు ఇక్కడ క్లిక్‌ చేయండి.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.



Source link

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *