ప్రముఖ సినీ నటుడు, టీవీకే అధ్యక్షుడు విజయ్ పొలిటికల్ ర్యాలీ సందర్భంగా ఘోర విషాదం చోటు చేసుకుంది. శనివారం (సెప్టెంబర్ 28) రాత్రి తమిళనాడులోని కరూర్లో జరిగిన తొక్కసలాటలో 39 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇందులో 8 మంది చిన్నారులు, 16 మంది మహిళలు ఉండడం శోచనీయం. మృతదేహాలు, బాధిత కుటుంబాల రోదనలతో ఆస్పత్రుల్లో విషాదకర దృశ్యాలు కనిపిస్తున్నాయి. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తో పాటు పలువురు మంత్రులు, నాయకులు ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు. ఈ క్రమంలో విజయ్ సభలో జరిగిన తొక్కిసలాటపై హీరో విశాల్ స్పందించారు. ‘టీవీకే విజయ్ ర్యాలీలో తొక్కిసలాట జరిగి 30 మందికి పైగా మరణించారని తెలిసి నా హృదయం తరుక్కుపోతోంది. అమాయకులు ప్రాణాలు కోల్పోవడం మరీ బాధాకరం. బాధిత కుటుంబాలకు టీవీకే పార్టీ పరిహారం ఇవ్వాలి. ప్రస్తుతానికి మీరు చేయగలిగింది అదొక్కటే. ఇక ముందు జరిగే పొలిటికల్ సభలు, ర్యాలీల్లోనైనా భద్రతా చర్యలపై దృష్టి పెడతారని ఆశిస్తున్నాను’ అని (ఎక్స్) ట్వీట్ లో రాసుకొచ్చారు విశాల్.
ఇవి కూడా చదవండి
విశాల్ తో పాటు రజనీకాంత్, కమల్ హాసన్, పవన్ కల్యాణ్ తదితరులు ఈ విషాద ఘటనపై స్పందించారు. కరూర్లో జరిగిన తొక్కిసలాట ఘటనలో అమాయకులు ప్రాణాలు కోల్పోయిన వార్త నా గుండెను బరువెక్కించింది. తీవ్రమైన విషాదంలో మునిగిపోయాను. మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపం తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని వేడుకొంటున్నాను అని రజనీకాంత్ ట్వీట్ చేశారు.
హీరో విశాల్ ట్వీట్..
Utter nonsense. Hearing that more than 30 people including children losing their lives over a stampede in actor/politician Vijay’s rally is heartwrenching and totally not right.
My heart goes out to every one of those innocent victims and my deepest condolences to every one of…
— Vishal (@VishalKOfficial) September 27, 2025
రజనీకాంత్ రియాక్షన్..
கரூரில் நிகழ்ந்திருக்கும் அப்பாவி மக்களின் உயிரிழப்புச் செய்தி நெஞ்சை உலுக்கி மிகவும் வேதனையளிக்கிறது.
உயிரிழந்தோரின் குடும்பத்தினருக்கு என் ஆழ்ந்த அனுதாபங்கள். காயமடைந்தோருக்கு ஆறுதல்கள்.#Karur #Stampede
— Rajinikanth (@rajinikanth) September 27, 2025
‘కరూర్ తొక్కిసలాట దుర్ఘటన వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఈ విషాద వార్తతో నా మనసు మూగబోయింది. అమాయకులైన ప్రజలు ప్రాణాలు కోల్పోయారనే వార్త నన్ను తీవ్రంగా బాధించింది. బాధితులకు సరైన,మెరుగైన చికిత్స అందించాలని తమిళనాడు ప్రభుత్వానికి మనవి చేసుకొంటున్నాను. బాధితులకు ప్రభుత్వం అండగా నిలువాలని కోరుతున్నాను’ అని కమల్ హాసన్ ట్వీట్ చేశారు.
కమల్ హాసన్ ట్వీట్..
நெஞ்சு பதைக்கிறது. கரூரிலிருந்து வரும் செய்திகள் பேரதிர்ச்சியையும் வேதனையையும் அளிக்கின்றன. கூட்ட நெரிசலில் சிக்கி உயிரிழந்த அப்பாவி மக்களுக்கு என் ஆழ்ந்த இரங்கலைத் தெரிவிக்கவும் வார்த்தைகளின்றித் திகைக்கிறேன்.
நெரிசலிலிருந்து மீட்கப்பட்டவர்களுக்கு உரிய சிகிச்சையும்,…
— Kamal Haasan (@ikamalhaasan) September 27, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.